Friday, 5 September 2025

మదర్ థెరీసా (1910-1997)

 

(26 August 1910 – 5 September 1997)

“ఎదుటివారిని చూసి ప్రేమ పూర్వకంగా నవ్వగలిగితే, అదే వారికి నువ్విచ్చే అందమైన బహుమతి “

మదర్ థెరీసా చిన్న వయస్సులోనే , భారతదేశంలో నన్ గా సేవలందించుటకు తాను పిలువబడ్డానని గ్రహించారు. 1946 వ సంవత్సరములో కలకత్తాలో నివసిస్తూ బోధన వృత్తిని కొనసాగిస్తున్న ఆమె కలకత్తాలోని అత్యంత దయనీయ స్థితిలో ఉన్న బీదవారి మధ్య నివసించి వారికి ఉచిత సేవలను అందించాలని “తన పిలుపులోనే మరొకపిలుపు” ను ఆమె పొందుకున్నారు. ఆమె భారత దేశానికి వచ్చి తన జీవితాంతం వరకు అట్టడుగు స్థితిలో ఉన్న బీద ప్రజలకు, అనాధలకు, అనారోగ్యంతో ఉన్నవారికి  చేసిన సేవ మరుపురానిది.

స్కోపే నగరంలో బాల్య జీవితం :

అది సెర్బియా లోని స్కోపే నగరం. అక్కడ ఆల్బేనియాకు చెందిన కుటుంబాలు అనేకం నివసించేవి. బోయాజీన్ కుటుంబం కుడా అందులో ఒకటి. అక్కడి ప్రజలు టర్కిష్ మరియు సెర్బోక్రొయేషియన్ భాషలు మాట్లాడేవారు. ఆల్బేనియన్లు మాత్రం ఇంట్లో ఆల్బేనియన్ భాషనే మాట్లాడేవారు. బోయాజీన్లు  ఈస్టర్న్ అర్థడాక్స్ క్రిస్టియన్లుగా  పిలువబడే కేథలిక్ లు. స్కోపే లో అనేకులు ముస్లింలు కూడా ఉండేవారు. ఆ నగరంలో మసీదులు, ఎత్తయిన మినారేట్లు ఎక్కువగా ఉండేవి.

నికోలాయ్ బోయాజీన్ మరియు డ్రేనాఫిల్ దంపతులు స్కోపేలో స్థిరపడ్డారు. నికోలాయ్ , మోర్టేన్ అనే ఒక ఇటాలియన్ వ్యక్తితో కలిసి వ్యాపారం చేసేవాడు. తినుబండారాలు, వస్తువులు, లెదర్ సామానులు మొదలగు వాటిని కొనుగోలు చేసి అమ్మేవారు. వారికి ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె అగాథా, కుమారుడు లాజర్ మరియు చిన్న కుమార్తె గోన్జా. వారు ఆతిథ్యం ఇవ్వడంలో ముందుండేవాళ్ళు. అతిథులను రంజింపజేయడానికి పాటలు పాడేవాళ్ళు. వాయిద్యాలను వాయించేవాళ్ళు. వారి ఇంటికి వచ్చే అతిథులు కొందరు మురికిగా ఉండేవారు. వారి నుండి దుర్వాసన వచ్చేది. కొందరికి ఆహారాన్ని , వస్త్రాలను తరచుగా ఇచ్చేవారు. తన చిన్న కుమార్తె గోన్జాతో తల్లి ఈ విధంగా చెప్పేది. “యేసు ఈ విధంగానే గాయాలతో బాధపడ్డాడు గోన్జా, ఇటువంటి ప్రజలకు నీవు సహాయం చేస్తే యేసయ్యకు సహాయం చేసినట్టే “

గోన్జా అనగా ఆల్బేనియన్ భాషలో “పూ మొగ్గ “ అని అర్థం. ఆమె తల్లి తన చిన్న కూతురుని ఎంతో ముద్దుగా గోన్జా అని పిలుచుకునేది. గోన్జా యేసు ఈలోకానికి పసిబిడ్డగా అవతరించిన కారణంగా వచ్చిన ఆనందాన్ని గూర్చి ఆలోచించేది. ఆయన సిలువ వేయబడిన విషయం గూర్చి చింతించేది. ఆరేళ్ళ వయస్సులో అక్కడి చర్చ్ ఆఫ్ సేక్రేడ్ హార్ట్ కు చెందిన బడికి వెళ్ళేది. చిన్నప్పటి నుండే ఆల్బేనియన్, సెర్బో క్రొయేషియన్, టర్కిష్ , ఫ్రెంచ్ మరియు ఇటాలియన్ భాషలు మాట్లాడేది. గోన్జా కవితాత్మకముగా ఉండేది. కథలు రాసేది. అగాథా ఎక్కువ తెలివి గలది. లాజర్ తన తండ్రి వలె ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు.

వారు నివసించే ప్రాంతంలో యుద్ధాలు సర్వసాధారణంగా జరుగుతుండేవి. తమ పాత శత్రువైన టర్కీకి వ్యతిరేకంగా సెర్బ్ లు, అల్బేనియన్లు పోరాడేవారు. గోన్జా తండ్రి యుద్ధసమయంలో మరణించాడు. రాజకీయంగా అతనికి విషం ఇచ్చి చంపారని గోన్జా విన్నది. రాజకీయాలు ఎంత ప్రమాదకరమైనవో గోన్జాకు అర్థం అయ్యింది. తన తండ్రి యొక్క వ్యాపారాన్ని ఆర్ధిక అవసరాల నిమిత్తం  తల్లి కొనసాగించింది. స్వయంకృషి తో వ్యాపారాన్ని ఆమె త్వరగానే అభివృద్ధి చేసింది. ప్రతి వ్యక్తీ కూడా సాధారణంగా ఇతరులు ఊహించే దానికన్నా ఎంతో తెలివైనవారు మరియు విలువైనవారు అనే సత్యాన్ని ఆమె తల్లిని చూసి తెలుసుకున్నది.  “పేదవాళ్ళు కూడా విలువైన వారే, దేవుని దృష్టిలో వస్తు సంపదకు అసలు విలువ లేదు” అని నమ్మింది గోన్జా. తాను పెద్దయిన తరువాత ఒక ఉపాధ్యాయురాలిగా కావాలని తలంచేది.

గోన్జా చదువులో , చర్చి కార్య కలాపాల్లో ముందుండేది. స్కూల్ లో తానే టాప్ స్టూడెంట్. ఆమె ముఖం ఎత్తయిన నుదురు, మెరుస్తున్న కళ్ళతో ఎంతో తేజస్సుతో ఉండేది. ఆమె ఇంటి పని చేసేది. ఖాళీ సమయాలలో అమ్మతో కలిసి పేదలను దర్శించేది. చర్చి ఫంక్షన్లలో అక్కతో కలిసి పాటలు పాడేది. స్నేహితులతో ఆటలాడేది. పుస్తకాలు మరియు పద్యాలు వ్రాసేది.

ఒకనాడు వారి చర్చి ఫాదర్ ఇగ్నేషియస్ లయోలా మాటలను గోన్జాకు గుర్తు చేశారు . “నేను క్రీస్తు నిమిత్తం ఏమి చేసాను? క్రీస్తు కొరకు నేను ఏమి చేస్తున్నాను? క్రీస్తు కొరకై నేను ఏమి చేయబోవుచున్నాను? “. గోన్జాను అవి ఎంతో ఉత్తేజపరిచాయి. చర్చికి సంబంధించిన బృందంతో కలిసి నూతన కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనసాగింది.

“సహాయం చెయ్యడానికి ఉండాల్సింది డబ్బు కాదు, మంచి మనస్సు”

భారతదేశానికి మిషనరీగా ప్రయాణం :

భారతదేశం గురించి కథలు కథలుగా విన్నా గోన్జాకు ఆ దేశమంటే ఎంతో యిష్టం కలిగింది. అనేక భాషలు, అనేక మతాలు, భారీ సంఖ్యలో ప్రజలు అంతేకాకుండా వారు పడుతున్న వేదన. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఆధీనంలో భారతదేశం ఉండేది. 1600 సంవత్సరం నుండి బ్రిటిష్ ఆధిపత్యం అధికమయ్యింది. 1800 సంవత్సరం చివరకు అనేకమంది విద్యావంతులైన భారతీయులు కలిసి ఒక జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. గోన్జాకు బెంగాల్ ప్రాంతం ఎంతో ఇష్టమైనది. భారతదేశాన్ని గూర్చి తనకు దొరికిన సమాచారాన్ని అంటా చదివింది. ఆమెకు దేవుడు భారతదేశానికి రమ్మంటున్నాడని అర్థమయ్యింది. కాని ఇంట్లో అమ్మ మరియు అక్క, సోదరుడు దీనిని సమర్థించలేదు. ఆమె యవ్వనస్తురాలైనప్పటికీ  అయిదు అడుగుల ఎత్తు తో చూడటానికి  చిన్న పిల్లలా ఉండేది. నలభై కేజీల బరువు కూడా ఉండేది కాదు. భారతదేశానికి మిషనరీగా వెళ్ళడం అంటే తన కుటుంబంతో పూర్తిగా వేరుపడటమే. కాని ఆమె తల్లి చివరకు విచారంగా “గోన్జా, నీవు వెళ్ళవచ్చు , నా దీవెనలు ఎల్లప్పుడూ నీకు ఉంటాయి. కాని దేవుని కొరకు, క్రీస్తు కొరకు మాత్రమే జీవించుటకు ప్రయాసపడు” అని ఆమెను దీవించింది.

1928 వ సంవత్సరం సెప్టెంబర్ 26 న గోన్జా భారతదేశానికి బయలుదేరింది. ఆమె ఎక్కిన రైలు యుగోస్లోవియా మీదుగా పారిస్ కు చేరింది. ఈ మధ్యలో మరో సిస్టర్ బెటికే తోడయ్యింది. పారిస్ నుండి వారు  ఐర్లాండ్ వెళ్ళే ఓడలో ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో వారికి కొన్ని ఇంగ్లీషు పుస్తకాలు ఇవ్వబడ్డాయి. గోన్జా ఇంగ్లీషు భాషలో ప్రార్ధించడం కూడా నేర్చుకుంది. 1929 వ సంవత్సరం క్రిస్మస్ సమయంలో వారు సిలోన్ కు చేరారు. ఆ తరువాత కొన్ని దినాలకు మద్రాసు చేరారు. అక్కడ ఆమె చూసిన దారిద్ర్యం ఎన్నడూ ఊహించనిది. తాటాకులతో అల్లబడిన చాపలపై కుటుంబాలు వీధులలోనే నివసిస్తున్నారు. బురదనేల  మీద నివాసముంటున్నారు. వారికి ఒంటి మీద గుడ్డలు కూడా సరిగా లేవు. ముక్కులకు, చెవులకు ఆభరణాలు ధరించారు. భారతదేశం అంటే ఇదన్నమాట అని తన తోటి సిస్టర్ బెటికే తో అన్నది గోన్జా. జనవరి 6న వారు హుగ్లీ నది ఒడ్డునకు చేరారు. తనకిష్టమైన బెంగాల్ నెల పై అడుగుపెట్టినందుకు గోన్జా ఎంతో సంతోషించింది. 1929 వ సంవత్సరం మే 24 న గోన్జా మరియు బెటికే లను నన్స్ గా అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం డార్జిలింగ్ లో జరిగింది. గోన్జా ను సిస్టర్ మేరి థెరీసా గా బెటికే ను సిస్టర్ మేరీ మగ్ధలేనే అని నామకరణం చేశారు. వారిరువురు హ్యాబిట్ అనబడే వాదులు వస్త్రాన్ని ధరించి భుజాల క్రింద వరకు తెల్లటి కాలర్ ధరించాలి. తల పై తెల్లని ముసుగు ధరించి దేవదూతల వలె కనిపించసాగారు. వారికి రెండు సంవత్సరాల పాటు శిక్షణ నిచ్చారు. దైవిక సారాంశాలను జ్ఞాపకముంచుకొని బయటకు వల్లేవేయుటను అలవాటు చేసుకున్నారు. బైబిల్ లోని చిన్న వచనములు, కీర్తనలు, పాఠాలు, త్యాగధనుల జీవిత గాథలు వంటి కథనాల కూడికే ఈ దైవిక సారాంశాలు. 1932 వ సంవత్సరంలో తన కుటుంబం నుండి ఒక లేఖను అందుకున్నది సిస్టర్ థెరీసా. తన తల్లి స్కోపే నగరంలోనే ఒంటరిగా నివసిస్తున్నదని మరియు తన అక్క అగాథా సహోదరుడు లాజర్ తిరానా లో నివసిస్తున్నారని , తన తల్లి తానూ చేస్తున్న పని పట్ల ఎంతో సంతోషిస్తున్నట్లుగా తెలుసుకున్నది.

ఆ దినాలలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయుల పోరాటం ఎంతో ఉధృతంగా జరుగుతూ ఉండేది. నాయకుడైన గాంధీని, ఇతర జాతీయ కాంగ్రెస్ నాయకులను చెరసాలలో పెట్టారు. గాంధీ యొక్క వ్యక్తిత్వం థెరీసాను ఆకట్టుకునేది. ఆయనకు కొండ మీడి ప్రసంగం అంతా కంఠతా వచ్చు. “లీడ్ కైండ్లీ లైట్ “అంటూ తానూ ఇష్టపడే క్రైస్తవ గీతాన్ని ఆయన తరచూ పాడుతూ వుంటారు. ఆయన ఒక బలమైన నైతిక శక్తి. ఆ దినాలలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తే కోట్లాది భారతీయులు ఆయనకు మద్దతుగా బ్రిటిష్ వారిపై తిరగబడ్డారు. ప్రపంచంలో కూడా సరియైన పరిస్థితులు లేవు. జర్మనీలో నాజీ పార్టీ నాయకుడు హిట్లర్ దుష్ట కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. పోప్ ఉండే ఇటలీ దేశంలో కూడా పరిస్థితులు సమాధానంగా లేవు. ఇటువంటి  పరిస్థితులలో థెరీసా తన విధులను సక్రమంగా నిర్వర్తించకపోతే తానొక సామాన్య క్రీస్తు సేవకురాలిగా మిగిలిపోతానని అర్థం చేసుకుంది. బెంగాలీ భాషను కష్టపడి నేర్చుకుంది. ఒక బెంగాలీ స్కూల్ లో చరిత్ర, , భూగోళ శాస్త్రాలను బోధించడం ప్రారంభించారు. 1935 వ సంవత్సరంలో 20 సంవత్సరాల వయస్సు వున్న సిస్టర్ థెరీసా తన బోధనలలో తీరికలేకుండా ఉన్నప్పటికీ అనేకమంది ఇతర నన్ లకు తమ పరీక్షలలో సహాయం చేసింది. వీటితో పాటు రోగులకు కూడా సేవలందించింది. థెరీసా తన చుట్టూ దారిద్ర్యంలో ఉన్న పేదప్రజలు ఏవిధంగా సహాయపడాలి అని ఎల్లప్పుడూ వారి విషయమై మథనపడేది.

1939 నుండి 1944 వరకు అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. 1945 లో ఊహించని పరిణామాలు జరిగాయి అప్పుడు జరిగిన హిందూ ముస్లిం ఘర్షణలలో ఒక్క కలకత్తా నగరంలోనే వేలాదిమంది మరణించారు. ఆ సమయంలో డార్జిలింగ్ కు సదస్సు నిమిత్తం పయనమయిన థెరీసా కు ఒక స్వరం వినిపించింది. “బీదల యొద్దకు వెళ్ళు, కాన్వెంట్ ను విడచి పెట్టు”. కాన్వెంట్ నుండి బయటకు వచ్చి అట్టడుగు వర్గాల ప్రజలతో కలసి జీవిస్తూ తన సేవలను కొనసాగించుటకు థెరీసా పై అధికారులకు వినతి పత్రాన్ని పంపింది.

“నువ్వు ఇతరుల లోపాలను వెతకడం ప్రారంభిస్తే ...ఎవరినీ ప్రేమించలేవు”

మిషనరీస్ ఆఫ్ ఛారిటీ స్థాపన :

థెరిసా పాట్నా లోని మెడికల్ మిషన్ సిస్టర్స్ వద్ద శిక్షణ తీసుకుంది. క్షయ వ్యాధి మరియు కుష్ఠు వ్యాధిగ్రస్తులను దగ్గరనుండి చూశారు. అలా పరిశీలించడమే కాకుండా ఆ వ్యాధిగ్రస్తులకు సేవచేయడం ప్రారంభించారు. మరణించే స్థితిలో ఉండే అనేకులను చేతులు పట్టుకొని వారిని ఓదార్చేది. రోగి దగ్గర లేనప్పుడు వారి పరుపులు మార్చడం , రోగులకు స్నానం చేయించడం, ఇంజెక్షన్లు చేయడం ఆమె నేర్చుకున్నారు. స్త్రీలకు ప్రసవ సమయంలో కూడా  ఆమె సహాయం చేసేవారు.

1948 వ సంవత్సరం డిసెంబర్ 8 వ తారీఖున తిరిగి కలకత్తా చేరుకున్నారు. తన చుట్టూ ప్రక్కన గల మురికి గుదీసెలలొ నుండి 5 గురు పిల్లలను తీసికొని వారికి పెరెల్ లేక ప్రక్కన గల ఖాళీ స్థలంలో చదువు నేర్పడం ప్రారంభించారు. కొద్ది రోజులలోనే ఆ బిడ్డలు ఆమె కొరకు ప్రతిరోజూ ఎదురు చూడటం ఆరంభించారు. తమను తాము పరిశుభ్రంగా ఉంచుకోవడం వారికి నేర్పారు. పరిశుభ్రత, అక్షరాభ్యాసత తో పాటు మంచి అలవాట్లు, మాట విషయాలను కూడా వారికి బోధించారు. ఊహించని రీతిలో కొందరు ఆమెకు సహాయం చేయడం ప్రారంభించారు, కొందరు ఆహారం, సబ్బులు, పాలు మొదలైనవి  తెచ్చి ఇవ్వసాగారు. త్వరలోనే 35 మంది పిల్లలు చేరారు. కొన్ని దినాల తరువాత కలకత్తా కార్పోరేషన్ నుండి నిధుల కొరకు దరఖాస్తు చేసుకోమని కొందరు సలహా ఇచ్చారు. కాని ప్రభుత్వ సహాయంతో కాకుండా స్వచ్చందంగానే సేవ చేయాలని విశ్వాసంతో అడుగు ముందుకేశారు. ఆ తరువాత ఒక ఉచిత క్లినిక్ ను కూడా ఆమె ప్రారంభించారు. తరువాతి దినాలలో కలకత్తా లోని ఇరుకైన ప్రాంతంలో గోమ్స్ అనే భారత సంతతి వారికి చెందిన వారు తమ గృహాన్ని థెరీసా సేవల నిమిత్తమై ఉచితంగా ఇచ్చారు. ఆమెతో పాటు సహకరించడానికి మరో ఇద్దరు సిస్టర్లు ముందుకు వచ్చారు. “సంతోషంతో మీ సేవలను అందివ్వండి” అని థెరీసా పదే పదే వేడుకునేవారు. మనుష్యులకు సహాయం చేస్తే యేసుకు సహాయం చేసినట్లే అని ఆమె ఎల్లపుడూ జ్ఞాపకం చేసుకుంటారు.

థెరీసా ఒక చక్కని క్రమశిక్షణ గల ప్రణాళికను తన వసతి గృహంలో అనుసరించేవారు. ఎప్పుడు ప్రార్ధించాలి? తినాలి? ఇంటి నుండి బయటకు వెళ్ళాలి? మొదలగు పనివేళ కొరకు గంటను మ్రోగించేవారు. 1950 సంవత్సరాని కల్లా మిషనరీస్ ఆఫ్ చారిటీస్, కలకత్తా దయాసిస్ నందు ఒక చాపెల్ ప్రారంభమయ్యింది. 1952 లో “నిర్మల్ హృదయ్” ను ప్రారంభించారు. ఆ వసతి గృహంలో అందరూ ఆమెను ‘మదర్’ గా సంబోదించేవారు. మరణావస్థ లో ఉన్న పేదలను సిస్టర్లు మాత్రమే కాకుండా ఆరోగ్య విభాగం వారు కూడా నిర్మల్ హృదయ్ కు తీసుకొని రాసాగారు. అనేకులు దానిని ‘ చనిపోవుచున్న వారికి ఆశ్రయ గృహము’ అని పిలువసాగారు. చనిపోతున్న వారిని ఆఖరు క్షణాలలో క్రైస్తవులుగా మారుస్తున్నారని పుకార్లు వచ్చాయి. కాని థెరీసా ఏ ఒక్కరికీ జవాబు నిచ్చేవారు కాదు. చిరునవ్వుతో “ దేవుడు మిమ్మును కాపాడతాడు, ఆయన మిమ్మును ప్రేమిస్తున్నాడు “ అని మాత్రమే పలికేవారు.

1961 వ సంవత్సరానికంతా 130 మంది సిస్టర్లు సేవలో ఉన్నారు. బెంగాల్ లోని అసాన్సోల్ నందు కుష్ట సేవా కేంద్రాన్ని ప్రారంభించారు.1962 వ సంవత్సరం లో  మహారాష్ట్ర  ప్రాంతంలో మరొక సేవా సదనాన్ని ప్రారంభించారు. ఆ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ థెరీసా ను రాష్ట్రపతి భవన్ కు ఆహ్వానించారు. 1984 సంవత్సరానికంతా 270 హౌస్ లలో 2,400 మంది సిస్టర్లు 70 హౌస్ లలో 500 మంది బ్రదర్లు పరిచర్యలో ఉన్నారు. వారితో పనిచేసే కొ- వర్కర్ల సంఖ్య లక్షకు మించే ఉంటుంది. పీడిత ప్రజలు, వ్యభిచారులు, ఎయిడ్స్ బాధితులు వంటి వారికి నూతన సేవలు ఆరంభించారు. 1996 లో థెరీసా తన  వ ఏట  గుండెపోటు బారిన పడ్డారు. కాని ఆమె అనారోగ్యము నుండి కోలుకొని తిరిగి తన సేవా కార్యక్రమాలను కొనసాగించారు. 1997 వ సంవత్సరం సెప్టెంబర్ 5 న ఉదయకాలపు ఆరాధనకు హాజరయిన థెరీసా తీవ్ర గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు.

ప్రతివాళ్ళు గొప్ప సేవలు చెయ్యలేకపోవచ్చు

కాని చేసిన చిన్న సేవ గొప్పగా ఉండాలి

మనిషిని పట్టి పీడించే పెద్ద వ్యాధి కుష్ఠు రోగమో, క్షయనో కాదు

తాను ఎవ్వరికీ అక్కర్లేదనే భావనే !

ముగింపు :

మదర్ థెరీసా  1979 వ సంవత్సరం లో నోబుల్ బహుమతి తో సహా అనేక అంతర్జాతీయ , జాతీయ అవార్డులను తన సేవలకుగాను అందుకున్నారు. ఒక ఆశ్రయ గృహము, ఒక అనాథ ఆశ్రయము, ఒక కుష్ఠు రోగుల కాలనీ, వివిధ వైద్య కేంద్రాలు, లెక్కించలేని సంఖ్యలో నిరాశ్రయులకు ఆశ్రయాలు భారత దేశం అంతటా మరియు అంతర్జాతీయంగా స్థాపించబడ్డాయి. ఆమె చిన్న రూపం ప్రపంచవ్యాప్తంగా కనికరానికి మారుపేరుగా నిలిచిపోయింది. అభాగ్యులు అన్నివిధాలా బలపరచబడి గుర్తింపు పొందాలని ప్రత్యేకించి యేసు ప్రేమతో నింపబడి శక్తి పొందాలని మదర్ థెరీసా వారిని వెదుకుతూ వెళ్లి తన సేవలను అందించారు. ఆల్బేనియాకు చెందిన ఈ చిన్న పుష్పం భారతదేశం అంతటా తన సేవా పరిమళాలను వెదజల్లింది. క్రీస్తు ప్రేమకు చిహ్నంగా ప్రజల హృదయాలలో నిలిచిపోయింది.



Visit https://missionariesofcharity.org/










Saturday, 23 August 2025

Genesis Chapter 48 Quiz

1. Who was told that Jacob was ill?

a) Benjamin
b) Reuben
c) Joseph
d) Judah

2. Who did Joseph bring with him to see Jacob?

a) His wife
b) His servants
c) His sons, Manasseh and Ephraim
d) Pharaoh

3. Where did God appear to Jacob and bless him?

a) Canaan
b) Egypt
c) Bethel
d) Luz

4. What did Jacob say about Ephraim and Manasseh?

a) They shall return to Canaan
b) They shall be as his own sons
c) They shall serve Levi
d) They shall follow Joseph

5. What was Jacob’s condition when Joseph brought his sons?

a) He was unable to speak
b) His eyesight was failing
c) He was very strong
d) He was outside working

6. What did Jacob do before blessing Joseph’s sons?

a) He bathed and dressed
b) He kissed them and embraced them
c) He offered a sacrifice
d) He sent everyone out

7. Who did Jacob place his right hand on when blessing?

a) Manasseh
b) Joseph
c) Ephraim
d) Judah

8. How did Joseph react when Jacob crossed his hands?

a) He laughed
b) He was pleased
c) He was displeased
d) He remained silent

9. Why did Jacob cross his hands when blessing the boys?

a) By accident
b) He wanted to confuse Joseph
c) He was blind
d) He intended Ephraim to be greater

10. What did Jacob give Joseph at the end of the chapter?

a) A chariot
b) A portion of land above his brothers
c) A ring
d) A golden cup


Thursday, 7 August 2025

Genesis Chapter 47 Quiz

 

1. Who did Joseph take to meet Pharaoh first?

a) Judah
b) His brothers
c) Jacob
d) Benjamin

2. What did Pharaoh offer Jacob’s family?

a) The land of Zoan
b) Homes in Memphis
c) The best of the land, in Goshen
d) Positions in his palace

3. What did Pharaoh ask Jacob when they met?

a) His number of sons
b) His age
c) His favorite food
d) His homeland

4. How old was Jacob when he met Pharaoh?

a) 110
b) 130
c) 120
d) 125

5. What did Joseph provide for his father and brothers?

a) Weapons
b) Silver
c) Food and land
d) Gold and linen

6. What did the Egyptians give in exchange for food when their money was gone?

a) Their land
b) Their animals
c) Their jewelry
d) Their grain

7. What did the Egyptians offer after they had no livestock or money?

a) Their gods
b) Their freedom
c) Themselves and their land
d) Their clothing

8. What law did Joseph establish in Egypt regarding land?

a) All land must be shared
b) Pharaoh gets one-fifth of the produce
c) No land can be bought
d) All land is free

9. Whose land was not bought by Joseph?

a) The Levites
b) The military
c) The priests
d) The foreigners

10. Where did Jacob want to be buried?

a) In Egypt
b) Near Joseph
c) With his fathers in Canaan
d) In the Nile valley


Wednesday, 6 August 2025

మార్టిన్ లూథర్ -మతోద్ధారణ స్థాపకుడు (1483-1546)

 

ప్రొటెస్టంట్ (Protestant) ఉద్యమము యొక్క ఆవిర్భావము మరియు ఎదుగుదలకు కారణము ఒక వ్యక్తి యొక్క విశ్వాసము. అతడే  మార్టిన్ లూథర్. మధ్యయుగపు సంఘము ఎంతో అసంతృప్తితో నిండి వున్నప్పటికి చివరకు పోపు యొక్క అధికారముపై లూథర్ సవాలు యూరప్ నందలి క్రైస్తవ మతము యొక్క సంస్కరణకు నాంది పలికింది. అంతకు మునుపు ఎంతోమంది ఎదిరించినప్పటికిని, పాప పరిహార పత్రాల యొక్క విక్రయముపై లూథర్ జరిపిన దాడి సామాన్య మానవుని కూడా ఆకర్షించి వారిని అనుకూలముగా స్పందింపజేసినది.

బాల్యము- విద్యాభ్యాసము 

ఒక గనిలో పనిచేసే కార్మికుని కుమారుడైన లూథర్ తురింగియా (Thuringia) లోని ఐస్బన్(Eisleben) అను గ్రామములో జన్మించాడు. దృఢనిశ్చయం, స్వతంత్ర భావాలు గల వ్యక్తి ఐన అతని తండ్రి ఆరు గనులు మరియు రెండు పౌండరీలకు భాగస్తుడిగా వృద్ధిచెందాడు. అతడు ఆ పట్టణమునకు కౌన్సిలర్ (Councillor) గా పదవిని నిర్వర్తించాడు. పట్టణము మధ్యలో ఒక పెద్ద భవంతిని నిర్మించాడు. చిన్నవాడైన మార్టిన్ 'కతోలిక్  మత సంప్రదాయ ప్రకారముగా మూఢనమ్మకములతో, దుష్టశక్తుల భయముతో, నిత్యత్వాన్ని ధిక్కరిస్తూ, పాప పరిహార రుసుము చెల్లించుచూ, మంచి పనులు చేయువారే పరలోకము నందు స్థానము పొందగలరను నిరీక్షణతో పెంచబడ్డాడు. అప్పటి ప్రజలు సత్యాన్ని అనుసరింపక సంప్రదాయాలకు విలువనిస్తూ సంఘ సిద్ధాంతాలను ఆచరించిన వారే రక్షణ పొందగలరను గ్రుడ్డి నమ్మకముతో వుండేవారు.

1501వ సం॥ లో మార్టిన్ పద్దెనిమిదవ ప్రాయమున, అతని తండ్రి పురాతన విశ్వవిద్యాలయములో ఒకటైన ఎర్ ఫర్ట్ (Erfurt)కు మార్టిన్ ను పంపాడు. అక్కడ అతడు ఆర్ట్స్ విభాగము నందు పట్టా అందుకున్నాడు. మొదట న్యాయవాద వృత్తిని చేపట్టవలెనని తలంచాడు కాని ఒక నాడు అతని స్నేహితుడు పైన అకస్మాత్తుగా పిడుగుపాటు వలన మరణించుట అతని జీవితగతిని మార్చివేసింది. లూథర్  ఈ సంఘటనతో  బహుగా కలత చెందాడు . అతడు న్యాయవాది కావలెనను తలంపును విడచి, తన తండ్రి చిత్తానికి వ్యతిరేకముగా ఎర్ ఫర్ట్ నందలి ఐదు సన్యాసుల ఆశ్రమము (Monasteries) లలో ఒకటైన ఆగస్టీనియన్ హెర్మిట్స్ (Augustinian Hermits) నందు చేరాడు.

అతడు 1505లో ఒక క్రొత్తవానిగా (Novice) సన్యాసత్వమును స్వీకరించాడు. శిక్షణకాలములోనే  బోధించుటయందు అతనికి వున్న సమర్థతను గుర్తించిన అధికారులు అతనిని ఉన్నత స్థితికై ప్రోత్సహించారు. 1507లో అతడు మత గురువుగా అభిషేకింపబడ్డాడు. విట్టెన్ ్బర్గ్ (Wittenberg) విశ్వవిద్యాలయమునందు (Moral Philosophy) నీతి తత్త్వ శాస్త్ర భోధకునిగ కూడా నియమింపబడ్డాడు. 1512లో వేదాంత గురువుగా నియమింపబడి తన జీవితాంతము వరకు అందులోనే కొనసాగాడు. విశ్వవిధ్యాలయములో అతడు ఎంతో సమయము పరిశోధనలలో గడిపేవాడు. అతడు అపోస్తులుడైన పౌలును గూర్చి బోధించుచు, ప్రతిదినము పారిష్ చర్చ్ నందు బోధించుచూ, అనేక పత్రికలను కూడా రచించాడు. తరువాత క్రొత్త నిబంధనను  తన స్వంత భాషలో చదవాలనే కోరికతో  గ్రీకు భాషను అభ్యసించాడు.

లూథర్ బయటకు ఒక మేథావివలె అపారజ్ఞాన సంపన్నునిగా కనబడినప్పటికిని అతని మనస్సలో అనేక జవాబులు లేని ప్రశ్నలు అతనిని లోలోపల కలచివేసేవి. తన ముందు వున్న అనేక మంది వలె  అతడు కూడ  తన జీవితమును దేవుని యెదుట సరిచేసుకొన్నాడు , కాని సాధారణ  పద్ధతులైన ప్రాయశ్చిత్తము, ఒప్పుకోలు, ప్రార్థనలు, ఉపవాసము మరియు జాగరణలు తాను ఆశించిన శాంతిని అతని హృదయమునకు ఇవ్వలేకపోయాయి.

తీర్థ యాత్ర 

అతడు రోమ్ తీర్థ యాత్రకు వెళ్లాడు. అక్కడ అతనికి పాపములను ప్రాయశ్చిత్తము చేసికొనుటకు మరియు పూజ జరిగించుటకు అవకాశమియ్యబడింది. అచ్చట గురువు యొక్క ఉపదేశమును పొందాడు. కాని ఫలితము కానరాలేదు. అచట గల స్కాల సాంక్ట   (Scala Sancta) యొక్క 28 మెట్లు ఎక్కి వెళ్లాడు. అది యేసుక్రీస్తునకు తీర్పు తీర్చిన పొంతి పిలాతు గృహము యొక్క సోపానము దాని యొక్క ప్రతి మెట్టుపై జపమును వల్లించిన ప్రాయశ్చిత్తము కల్గునను మూఢనమ్మకముతో ఆవిధముగా చేసినను రక్షణ నిశ్చయత కలుగలేదు.

అతనికి ఆ మెట్లు ఎక్కుచుండగా అతనికి హబక్కూకు గ్రంథము నుండి ఈ వచనము మదిలో స్ఫురించింది.  "నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకును.", కాని అతని అంతరాత్మ ,ఈ  సత్యమును నేనెలా తెలిసికొనగలను ? అను సవాలును విసిరింది.

శాంతిని పొందుటలో విఫలునిగా అతడు జర్మనీ దేశమునకు తిరిగివచ్చాడు. సంఘము దేవుని రాజ్యము యొక్క తాళపుచెవిని మరచినదనే  విషయాన్ని అతడు దృఢముగా నమ్మాడు. అతడు ఈ విధముగా పలికాడు - "నేనొక అవివేకి వలె ఉల్లిపాయలను రోమ్ దేశమునకు తీసికొని వెళ్ళి, వెల్లుల్లితో తిరిగి వచ్చాను.”

పాపము వలన దోషిగా నిర్ధారింపబడిన వాడై లూథర్ తాను దేవుని తీర్పు ఎదుట నిలువబడలేని వాడుగా, నేరస్తునిగా, పాపిగా తీర్మానించుకొన్నాడు. విశ్వవిద్యాలయము నందలి అతని గురువైన స్టాపిట్జ్ (Staupitz) అను తత్యవేత్త లూథర్ యొక్క మనస్సును  దేవుని యొక్క క్షమాపణ, దయలవైపు మళ్ళించుటకు ప్రయత్నించాడు. కాని దేవుని యొద్ద నుండి రక్షణ పొందవలెనన్న బహుగా శ్రమపడవలసినదేనని అతడు ఉపదేశించాడు. ఈయన ఉపదేశములతో లూథర్ కొద్దిగా వూరట పొందాడు. 1513లో అతడు కీర్తనలలో ఒక అంశాన్ని బోధించుటకు సిద్ధపడుచుండగా అతనికి ఎంతో సుపరిచితమైన వచనము నందు తన ప్రశ్నకు జవాబు లభించింది. 'నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము’(కీర్తనలు 31:1)అని అక్కడ వ్రాయబడి వున్నది. 

పాప పరిహార పత్రములు

సంఘములోని తప్పుడు సిద్ధాంతాలను మరియు ఆచారాలను సవాలు చేయుటకు క్రొత్తగా జన్మించిన లూథర్ కు నాలుగు సంవత్సరములు పట్టింది. అప్పటి సంఘము తన అతిలాలసత్వాన్ని పోషించుటకు రోమ్ నందలి  పరిశుద్ధ. పేతురు భవనమును తిరిగి నిర్మించుటకు డబ్బుప్రోగు చేయవలెనని నిశ్చయించినది. మద్యయుగపు మానవులు తమ పాపములను త్వరగా ప్రాయశ్చిత్తము చేసికొన వలెనని ఆతురతతో పాపరిహార పత్రాలను కొనుగోలు చేయనారంభించారు. వీటి వలన పరలోకమునకు ప్రవేశించుటకు సులభ మార్గములైన పాపపు ఒప్పుకోలు, క్రీస్తు నందలి విశ్వాసమును ప్రక్కకు నెట్టివేయబడినవి.

పోపు ప్రతినిధి యైన టెట్బెల్ (Tetzel) అను నతడు విటెన్ బర్గ్ సమీపములోని పట్టణాన్ని దర్శించి పాపములన్నిటికై పరిహారమునకు గాను, మరియు చనిపోయిన తమ బంధు మిత్రులను సరాసరి పరలోకమునకు తీసుకొని వెళ్ళుటకు పాప పరిహార పత్రాలను విక్రయించుచుండగా లూథరుకు తాను పనిచేయుటకు అది సరియైన సమయముగా తోచెను

1517లో జరిగిన సకల పరిశుద్దుల పండుగ సాయంకాలం నందు అతడు విఖ్యాతి గాంచిన అతని 95 సిద్ధాంతములను విటెన్ బర్గ్ నందలి కాసిల్ చర్చ్ (Castile church) యొక్క తలుపునకు దిగగొట్టెను. అందులో అతడు పాప పరిహార పత్రాల విక్రయాన్ని ఖండించెను. అతడు ఆర్చ్ బిషప్ మరియు బిషప్   లకు కూడా వాటి ప్రతులను పంపెను. వారు వాటిని చదివి ఏ విధముగా ప్రతిస్పందించెదరో అని లూథర్ గమనింపసాగెను. లూథర్ యొక్క చర్యలు ఏమాత్రము అసాధారణమైనవి కావు గాని అవి తన ప్రసంగాలలో సామాన్య మానవునికి అర్థమయ్యే రీతిలో సంఘమునకు తన అభ్యం తరములను తెలియజేసెడివిగా వున్నాయి.

లూథర్ తన జీర్ణవ్యవస్థలో వచ్చిన అస్వస్థతతో బాధపడుచున్నను ఆక్స్ బర్గ్ కు ప్రయాణమయ్యాడు. చివరి మూడు మైళ్ళు ఒక బండిపై ప్రయాణము సాగించాడు. తన అభిప్రాయము మార్చుకొని తప్పుడు బోధనలు ఇకపై చేయకుండునట్లు పోప్ ఆజ్ఞాపించగలడని తనకు ఎంతో నమ్మకమైన కార్డినల్ కజటాన్ (Cardinal Cajetan) ద్వారా తెలిసికొన్నాడు. లూథర్ తాను అయితే బైబిల్ కు విరుద్ధముగా ఎటువంటి బోధనలనూ చేయుటలేదని పేర్కొనుచూ బహిరంగముగా చర్చించుటకు ఇష్టపడ్డాడు. ఈ వివాదమువలన పరిస్థితులు విషమించి లూథర్ వెలివేయబడవచ్చునను భయమును  కజెటాన్ వెలిబుచ్చాడు. లూథర్ ను బలపరచే అనేకులు అతని క్షేమము విషయమై భయపడసాగిరి. వారు లూథర్ రహస్యముగా మరణానికి లోనవుతాడేమోనను భయముతో తిరిగి అతనిని విటెన్ బర్గ్ నకు తీసుకొని వచ్చారు. 

సంస్కరణ కొరకు పోరాటము 

లూథర్ సంస్కరణ చేపట్టు యుద్ధములో ఒక ప్రాముఖ్యమైన దశకు వచ్చాడు. అతడు పోపు యొక్క అధికారమును ధిక్కరించుటేగాక అతని సభను తప్పుడుదిగా జమకట్టెను. రాజకీయ నాయకులు కూడా జర్మనీ దేశమును రోమ్ నుండి స్వతంత్రపరుచుటకు గల లాభాలను యోచింప సాగిరి. మత. సంబంధమైన స్వాతంత్రమే గాక, జర్మనీ దేశము యొక్క స్వాతంత్య్రత ప్రధానంశమైనది.

ముద్రణా యంత్రము యొక్క ఆవిష్కరణ (1455లో గుటెన్ బర్గ్ చే కనుగొనబడినది. అతడు బైబిల్ ను హీబ్రూ, లాటిన్ భాషలలోనికి  అనువదించెను) లూథర్ అనేక కరపత్రములు, గ్రంథములు రచించుటకు సహాయపడెను. 1520లో అతడు విశ్వ విఖ్యాతిగాంచిన మూడు కరపత్రములను ప్రచురించెను. తరువాత అనేక వేదాంత గ్రంథాలను, బైబిల్ కామెంటరీలను అనేక ఆధ్యాత్మిక ప్రచురణలను ముద్రించెను. తన 40 సం॥ వయస్సునుండి (1523) ప్రతి రెండు వారాలకు ఒక పుస్తకము ప్రచురింప సాగెను.

జూలై మాసము 1520లో ఎక్ గారికి ప్రేరేపణ ద్వారా Papal bull (పోపు ఆజ్ఞ ఎరుపు రంగుతో ముద్రచేయబడినది ) రోమ్ నుండి ఒక ఖండితమైన శిక్ష జారీ చేయబడినది. అదేమనగా లూథర్ రచనలు అన్నియు తగుల బెట్టవలెను. మరియు అతని అనుయాయుల నందరిని బహిష్కరింపవలెను. అతడు బహిరంగముగా క్షమాపణ చెప్పుకొనుటకు 60 దినములు గడువు ఇయ్యబడింది. ఈ ఆజ్ఞకు జర్మనీ దేశములో మిశ్రమ స్పందన లభించెను. అనేక పట్టణములు దీనిని సమ్మతింపలేదు. అతని పుస్తకములు అగ్నికి ఆహుతి చేయుటలో కూడా కొద్దిపాటి విజయము మాత్రము లభించినది. మైంజ్  (Mainz) అను స్థలమునందు ఒక నిరాక్షరాస్యుడైన సమాధులు త్రవ్వేవానికి ఈ పనిని అప్పగించిరి. దీనికి బదులుగా 50 మంది విద్యార్థులు లూథర్ కు వ్యతిరేకముగా వేసిన కరపత్రములను కాల్చివేసారు.

డిసెంబర్ పది, ఉదయం 9గం|| విటెన్బర్గ్ నందు లూథర్ తన తోటి అధ్యాపకులు మరియు కొంతమంది విద్యార్థులతో కలిసి సంఘము యొక్క రచనలను ధర్మనియమాలను మరియు ఎక్ గారితో జరిపిన సమావేశపు తాలూకు కాగితములను కాల్చివేసారు. లూథర్ ఒక అడుగు ముందుకు వేసి బహిరంగముగా పోపు ఆజ్ఞాపత్రాన్ని (Papal bull) మంటలలోకి విసిరివేసి పోపు యొక్క అధికారాన్ని వ్యతిరేకించుచున్నట్లుగా తెలియజేసాడు.

సాధారణ రీతిగా నైతే ఈవిధంగా చేసినందులకు లూథర్ ను అరెస్టు చేసి ఉరితీసియుండెడివారు. కాని Elector గా వున్న ఫ్రెడెరిక్ లూథర్ జర్మనీలో న్యాయస్థానము యెదుట తీర్పు తీర్చబడాలని బలవంతము చేసాడు. అప్పటి పరిపాలకుడు, యువకుడైన చక్రవర్తి ఛార్లెస్ V, స్పెయిన్ దేశపు రాజు. కాథలిక్ మతాభిమాని అయిన ఇతడు వోమ్స్ (Worms) నందు తనను కలువవలసిందిగా (April 1521) ఒక రాజాజ్ఞను లూథర్ నకు పంపించాడు. అతడు సంఘము యొక్క ఏకత్వాన్ని కోరి ఈ ఉద్యమమును అణచివేయాలని భావించాడు.

నేను ఇక్కడ నిలబడి వున్నాను "Here I stand”

లూథర్ యొక్క భద్రత నిమిత్తమై ఒక బండిని ప్రయాణముల కొరకై సిద్ధము చేసినప్పటికిని అతని స్నేహితులు అతనిని నివారించారు. వోమ్స్ లో ఎంతమంది దయ్యములు వున్నప్పటికిని నేను అక్కడికి ప్రవేశించెదను” అని లూథర్ బదులిచ్చాడు. మార్గమంతటిలో అతనికి ప్రజల నుండి గొప్ప ఆదరణ లభించింది. అతని ప్రసంగము వినుటకు అనేకులు వచ్చారు. అతనిచే ఉద్యమము కొనసాగనివ్వ కుండా చేయవలెననే శత్రువుల పన్నాగాలు నిరుపయోగమైనవి. చక్రవర్తి ఎదుటకు లూథర్ తేబడినపుడు అతనికి ఒక పుస్తకముల కట్ట ఇచ్చి వాటిని తక్షణమే త్యజించవలసినదిగా కోరిరి. అతడు వారిని కొంతసమయము అడిగాడు. తరువాతి దినము అతడు కౌన్సిల్ వారికి తాను తప్పు చేసినట్లు లేఖనములను ఆధారము చేసికొని, సరైన కారణములు చూపవలెనని  దేవుని వాక్యములో తనను తాను బంధించుకొని ఆత్మ పరిశీలన గావించుకొనుటకు తాను సిద్ధముగా నున్నానని పలికెను. రాజు ఎదుట అతడు ఈ విధముగా పలికెను - 'నేను ఏమియూ చేయలేను. నేను ఇక్కడ  నిలువబడియున్నాను. దేవుడు నాకు సహాయము జేయును గాక'

లూథర్ ను  ఖండించుటకు చక్రవర్తి చేసిన ప్రయత్నము తప్పిపోయెను అతడు విట్టెన్ బర్గ్ కు చేరుటకు 21 రోజులు గడువిచ్చిరి. అటు పిమ్మట అతని రాజ ధిక్కారము చేసిన వ్యక్తిగా వ్యవహరిస్తూ బహిష్కరించారు. చక్రవర్తిచే నిరాకరింపబడిన వ్యక్తిగా వుంచబడ్డాడు. అనగా అతని మిగిలి జీవితమంతయూ ఒంటరి జీవితము జీవించునట్లుగా కట్టుబడి చేసారు. తరువాతి  ఉదయము ఇరువది ముఖ్యమైన వ్యక్తులతో అతడు విట్టెన్ బర్గ్ తరలించబడ్డాడు. వారు తమ గమ్యస్థానము చేరు లోపల లూథర్ త్వరితముగా తన హెబ్రీ పాతనిబంధన గ్రంథమును మరి గ్రీకులోని క్రొత్త నిబంధనను తీసికొని వార్ట్ బర్గ్  (Wartburg) కోట లోనికి  వెళ్ళి తలదాచుకొన్నాడు. చాలా కాలము వరకు అతని శత్రువులు అతడు సంహరింపబడెనని భావించిరి. కాని అతడు Elector యొక్క కాపుదలలో  సురక్షితముగా వున్నాడు.

అతడు చెర పట్టబడిన కాలములో, లూథర్ తన సమయమును క్రొత్తనిబంధన గ్రంథాన్ని జర్మనీ భాషలోనికి అనువదించుటకు వినియోగించాడు. 1534 న అతడు బైబిల్ ను అనువదించుట పూర్తి చేసాడు. చివరకు అతడు ఆ కోటను విడిచి విట్టెన్ బర్గ్ కు వెళ్ళుట అవసరమని భావించాడు. అక్కడి యవ్వన సౌవార్తిక సంఘము కష్టములలో వున్నదని విని  తన అనుయాయులలో కొంతమంది విపరీత బోధనల లోపముతో  కష్టములను ఎదుర్కొనుచున్నారనియు మరియు దాని యొక్క నిర్వహణ సక్రమముగా లేదని తెలిసికొన్నాడు . వారము లోపలే, లూథర్ అక్కడి సమస్యలన్నిటిని సరిచేసాడు. ప్రవక్తలుగా తమను తాము చెప్పుకున్న వారంతా ఆ పట్టణమును వదిలిపెట్టి వెళ్లారు.

లూథర్ విట్టెన్ బర్గ్ నందు, ఫ్రెడెరిక్ యొక్క సంరక్షణలో క్షేమముగా నుండెను. సంస్కరింపబడిన మతము ఇతర పట్టణాలకు, నగరాలకు వ్యాపించే కొలది అనేక మంది యువరాజులు అందులో చేరి సౌవార్తిక సంఘము ఎదుగుటకు కృషిచేశారు. సంఘ విశ్వాసము మరియు సిద్ధాంతమును సంస్కరించుటలో నిమగ్నుడైనప్పటికిని లూథర్ కేథలిక్ మత సంప్రదాయములైన చర్చి భవనాలు, దుస్తులు, క్రొవ్వొత్తులను (Candles) మరియు సిలువలను గౌరవించాడు.

సంస్కరణలు 

లేఖనముల ముఖ్య వుద్దేశము, క్రీస్తు వలన రక్షణను గూర్చిన సిద్ధాంతములను పునరుద్ఘాటించుచూ అతడు ఆరాధనలో కొన్ని మార్పులను చేసాడు మరియు ఒక దివ్య ఆరాధనను ప్రతిపాదించాడు. అందులో బైబిల్ పఠనాన్ని మరియు వ్యాఖ్యానాన్ని ఉద్ఘాటించాడు. తాను మార్చిన ఆరాధనకు ఒక రూపము కల్పిస్తూ, సామాన్యముగా మరియు సిద్ధాంత పరమైన పవిత్రతతో నిండినదై వుండునట్లు రూపొందించాడు. (ఆంగ్లికన్లు ఆచరించు విధానము) కాకుండా అతడు సంఘ బోధకులకు ఒప్పుకోలు, వివాహము మొదలగు సందర్భాలలో వుపయోగించు ఆరాధనా క్రమము మరియు కీర్తనలతో కూడిన ఒక ఆరాధనా పుస్తకము – అందులో విశ్వ విఖ్యాతి గాంచిన (A Safe Stronghold Our God is Still) 'మా కర్త గట్టి దుర్గము’ కీర్తనను రచించెను. ఈ కీర్తనను ప్రొటెస్టంట్ ఉద్యమమునకు యుద్ధగీతికగా భావిస్తారు.

ఈ ఉద్యమమును అణచివేయుటకు ఛార్లెస్ చక్రవర్తి తన ప్రయత్నాలను మానలేదు. స్పేయర్ (Speyer) నందు 1526లో ఒక సమావేశము ఏర్పాట చేసాడు. అక్కడ ఆశ్చర్యరీతిలో లూథర్ నకు అనుకూలముగా వచ్చింది (చార్లెస్, పోప్ ల  మద్య వివాదాల కారణముచే), జర్మనీలోని ప్రతి రాష్ట్రము అక్కడి రాజు  యొక్క మతమును చేపట్ట వచ్చును.

రెండవ సమావేశము 1529లో సంఘమును ఏకము చేయుటకు మరియు టర్కీవారి నుండి దాడులను  ఎదుక్కొనుటకు ప్రతిపాదనలు చేయుటకు గాను ఏర్పాటు చేయబడినది. లూథర్ తన గ్రంథములో చక్రవర్తికి క్రైస్తవ లోకాన్ని సంరక్షించాల్సిన ఆవశ్యకత వున్నదనియు దీనిని జర్మనులు అందరు బలపరచాలని వ్రాసాడు. కౌన్సిల్ లోని కేథలిక్కులు సంఘ కార్య కలాపాలపై తమ దృష్టిని నిలిపారు. సంస్కరింపబడిన ప్రాంతాల వారు మినహాయించి మిగిలిన రాష్ట్రాలలోని వారు కేథలిక్ మతములోనే వుండాలని నిశ్చయించారు. దీని మూలముగా మతోద్ధారణ వ్యాప్తి చెందదని తలంచారు. సౌవార్తిక సంఘములోని లూథర్ వారసుడైన (Melanchthon) మెలానక్తన్  దీనిని త్రోసి పుచ్చాడు. వీరు ఈ నిర్ణయమును వ్యతిరేకించి దేవుని వాక్యము మరియు మనస్సాక్షికి మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వవలసినదిగా నొక్కిచెప్పారు.

క్రొత్త ఉద్యమము

స్పెయర్ (Speyer) నందు సౌవార్తికులచే ప్రారంభమైన తిరుగుబాటు వలనే 'ప్రొటెస్టంట్' అను పదము వాడుకలోనికి వచ్చినది. మతోద్దారణ జర్మనీ అంతటా హద్దులు లేకుండ విస్తరించింది . మిగిలిన ప్రొటెస్టంట్ గుంపులు కూడా బయటకు వచ్చాయి. వారిలో ఆనా బాప్టిస్టులు (Anabaptists) వీరు విశ్వాసులు బాప్తీస్మమును మాత్రమే సమర్థించుచూ, లూథర్ తో  1521 విట్టెన్ బర్గ్ నందు విడిపోయారు. జ్యూరిచ్ (Zurich) నందలి జ్వింగ్లి (Zwingli) మరియు అతని అనుచరులు కూడా వేరొక గుంపుగా ఏర్పడ్డారు. వారు సువార్తను అధికారానికి ఆయువుపట్టుగా భావించారు. లూథర్ మరియు  జ్వింగ్లి మధ్య విభేదాలు తొలగించుటకు చేసిన ప్రయత్నాలు సఫలము కాలేదు. రొట్టెవిరచుట, మరియు ద్రాక్ష రస సంస్కారము, వానిని పవిత్రముగా భావించు విషయలో మరియు రొట్టె, రసముల రూపములో, క్రీస్తు ప్రభువు యొక్క శరీర రక్తములున్నవను లూథరుయొక్క విశ్వాసము విషయమై జ్వింగ్లి వీరిరువురు విభేధించిరి. మెలానక్తన్ చే 1530 వ  సం. లో  The Confesion of Augsburg నందు సంస్కరింపబడిన విశ్వాసము యొక్క ముఖ్య విషయములు పొందుపరచబడినాయి. అది లూథరనలు  అవలంభించు విశ్వాస ప్రమాణముగా మారింది.

క్రమేణ లూథర్ యొక్క వ్యక్తిగత జీవితము కూడా సంస్కరింపబడెను. అతడు సన్యాసము నుండి తిరిగి వచ్చి పూర్వము మఠ కన్యకగా నున్న కేథరిన్ వాన్ బోరా  అను ఆమెను భార్యగా స్వీకరించెను. వీరు ఎంతో చక్కని వివాహ జీవితమును గడిపిరి. వారికి ఆరుగురు సంతానము మరియు నలుగురు అనాథలను దత్తత చేసికొనిరి. అతడు కుటుంబ పరముగా తన సంతోషమును పిల్లలతో పంచుకొనుచూ వారికి బోధించుచూ సంగీతమును నేర్పుచూ గడిపెను. అతడు ఎంతో దయగలవాడు మరియు దానశీలి. ఎప్పుడు చక్కని ఆతిధ్యమును ఇచ్చేవాడు. 

క్రుంగిపోవుట మరియు ఉల్లసించుట వంటి అనేక మనోభావాలు  లూథర్ కూడా కలిగియుండేవాడు. రైతుల యుద్ధము జరిగినప్పుడు శాంతికై ప్రయత్నించాడు. అది విఫలమైనప్పుడు అతడు న్యాయాధికారులతో వారిపై కఠినమైన చర్యలు తీసుకొనవలసినదిగా కోరాడు. రైతుల వధ జరిగి పరిస్థితులు భీతికరముగా మారెను. రోమన్లు ఈ నిందను సంస్కర్త అయిన లూథర్ మీదికి నెట్టారు. ఆదేవిధముగా యూదులకు వ్యతిరేకముగా వ్రాశాడు అని కూడా చరిత్ర చెబుతుంది.

ముగింపు 

   లూథర్ లో అనేక తప్పులు వున్నను, అతడు మన మధ్యకు వచ్చిన గొప్ప దైవజనులలో ఒకడు. తన జీవిత కాలమంతయు  సువార్తలలో చెప్పబడిన విధముగా  సంఘాన్ని సంస్కరించుటకు తన సమయాన్ని వెచ్చించాడు. ఎంతో అస్వస్థతో వ్యాకులతతో నిండిన లూథర్ తన భార్యను చూచుటకై ప్రయాణించుచూ ఐస్బన్ (Eisleben) లో మరణించాడు. అతడు తన తుదిశ్వాస విడచుచు నప్పుడు అతడు యోహాను3:16 తన పరిశోధన మరియు జీవితము యొక్క పునాది యైన ఆ వాక్యభాగాన్ని పదే పదే విన్నాడు. లూథరనిజమ్ (Lutheranism) జర్మనీ నుండి (Scandinavia) స్కాండినేవియాకు వ్యాపించినది. అక్కడ అది ప్రభుత్వపు సంఘముగా గుర్తింపబడినది. స్వీడన్ లో కూడా ఈ మతోద్దారణ కలిగినది. కాని మధ్యయుగపు సంప్రదాయాల నుండి అంత సులభముగా సంబంధాలు తెంచుకోలేదు. మరియు వారి భావనలు ఫ్రాన్స్, హాలండ్, స్కాట్లాండ్ వరకు  వ్యాపించాయి


Monday, 21 July 2025

Genesis Chapter 46 Quiz

 

1. Where did Israel (Jacob) stop to offer sacrifices on his way to Egypt?

a) Bethel
b) Beersheba
c) Hebron
d) Shechem

2. Who spoke to Jacob in a vision at night?

a) An angel
b) Joseph
c) God
d) A prophet

3. What promise did God give Jacob in the vision?

a) He would return to Canaan
b) He would make him a great nation in Egypt
c) He would see Abraham again
d) Joseph would return to Canaan

4. How did Jacob travel to Egypt?

a) On foot
b) On camels
c) In the wagons sent by Pharaoh
d) On donkeys

5. How many direct descendants of Jacob went to Egypt?

a) 60
b) 70
c) 75
d) 80

6. Who did Jacob send ahead of him to Joseph?

a) Simeon
b) Judah
c) Levi
d) Reuben

7. What did Joseph do when he met his father?

a) Gave him food
b) Fell on his neck and wept
c) Took him to Pharaoh immediately
d) Sang with him

8. What did Jacob say he could now do after seeing Joseph?

a) Return to Canaan
b) Build an altar
c) Die in peace
d) Speak to Pharaoh

9. What was the occupation of Jacob’s family?

a) Farmers
b) Carpenters
c) Shepherds
d) Soldiers

10. Why was it important to Joseph to tell Pharaoh his family's occupation?

a) Egyptians despised shepherds
b) He wanted them to live in the palace
c) He wanted them to settle in Canaan
d) Pharaoh loved shepherds


Monday, 30 June 2025

Genesis Chapter 45 Quiz

 

1. What did Joseph do before he revealed his identity to his brothers?

a) Sent everyone else out of the room
b) Offered them food
c) Asked for Benjamin
d) Told them a parable

2. How did Joseph react emotionally when he revealed himself?

a) He laughed
b) He sang
c) He wept loudly
d) He remained silent

3. How did Joseph’s brothers respond when he revealed himself?

a) They embraced him
b) They were terrified
c) They rejoiced
d) They left the room

4. Why did Joseph say God sent him to Egypt?

a) To make him rich
b) To punish his brothers
c) To preserve life
d) To meet Pharaoh

5. Who did Joseph say made him a father to Pharaoh?

a) His brothers
b) Pharaoh himself
c) God
d) His own wisdom

6. What land did Joseph offer to his family to settle in?

a) Canaan
b) Goshen
c) Egypt proper
d) Hebron

7. How many years of famine remained at that time?

a) Three
b) Five
c) Seven
d) Two

8. What did Pharaoh command Joseph to do for his family?

a) Send them gold
b) Give them land
c) Bring them to Egypt
d) Build them homes in Canaan

9. What special gift did Joseph give to Benjamin?

a) A ring and robe
b) Silver and garments
c) Five times more than the others
d) A new chariot

10. What message did Joseph send to Jacob?

a) Stay in Canaan
b) Forget what happened
c) Come to me in Egypt
d) Bring more grain

Monday, 23 June 2025

బ్లెయిజ్ పాస్కల్ ప్రఖ్యాత శాస్త్రవేత్త (1623 – 1662)

అది 1654 వ సంవత్సరం, అక్టోబర్ మాసం. ఒక వ్యక్తి ప్రతీదినం లాగానే తన గుర్రపు బండిని తానే నడుపుకుంటూ తన ఊరి దగ్గరలోని నదిపై కట్టిన వంతెన మీదకు వెళ్ళాడు. కాని అనుకోకుండా గుర్రాలు రెండూ నది లోకి దూకాయి. ఈ సంఘటన లో దేవుని కృపను బట్టి బండి మాతం పిట్టగోడ వరకూ వచ్చి దానిపై ఆనుకుంది. అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఆ వ్యక్తి షాక్ కు గురయ్యాడు. అతి కష్టం మీద స్ప్రహ లోనికి వచ్చాడు. దీనితో అతని నరాలు చిట్లి నిద్రలేని రాత్రులు గడిపేవాడు. ఆ సంఘటన అతని జీవితంలో పెనుమార్పులు తీసుకొని వచ్చింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు బ్లెయిజ్ పాస్కల్. బ్లెయిజ్ పాస్కల్ ప్రాన్స్ దేశానికి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు, పదార్థ విజ్ఞాన శాస్త్రజ్ఞుడు , మత తాత్వికుడు మరియు వేదాంతి. 1654 వ సంవత్సరంలో జరిగిన ఒక దుర్ఘటన లో ఆయన దాదాపుగా ప్రాణాన్ని కోల్పోయే స్థితి నుండి పునర్జన్మను పొందడమే కాకుండా నూతన జన్మను కూడా పొందాడు. యేసు క్రీస్తు వ్యక్తిత్వం పై ఆయన సిద్ధాంతం ఆధారపడి ఉండేది. హేతువు ద్వారా కన్నా హృదయం ద్వారానే ఒకడు దేవుని అనుభవ పూర్వకంగా తెలుసుకోగలడని ఆయన నమ్మకం. 

 బాల్యం 
 పాస్కల్ ఫ్రాన్స్ దేశంలోని క్లెర్మాంట్- ఫెరాండ్ (Clermont – Ferrand) అనే స్థలంలో 1623 వ సంవత్సరంలో జన్మించాడు. అతని తల్లి ఆంటోనెట్ బెగాన్ (Antoinette Begon). అతనికి మూడేళ్ళ వయస్సు ఉన్నప్పుడే ఆమె మరణించింది. అతని తండ్రి ఎటిన్ పాస్కల్ (Etiene Pascal) కూడా గణితశాస్త్రమంటే ఎంతో మక్కువ గలవాడు. ఆయన స్థానిక న్యాయస్థానంలో కూడా సభ్యుడిగా ఒక గౌరవనీయమైన స్థానం కలిగి ఉండేవాడు. పాస్కల్ కు ఇద్దరు సహోదరీలు గిల్మర్ట్ (Gilberte) మరియు జాక్విలిన్ (Jaquline). తన భార్య మరణించిన 5 సంవత్సరాల తరువాత ఎటిన్ పాస్కల్ కుటుంబంతో సహా పారిస్ నగరానికి వచ్చాడు. ఆయన తన పిల్లల పోషణ భారాన్ని తానె చూసుకోవాలనే తలంపుతో పునర్వివాహం చేసుకోలేదు. వారందరు చిన్నతనం నుండే బాలమేధావులు గా ఎంతో ప్రతిభను కనబర్చేవారు. ముఖ్యంగా బ్లెయిజ్ గణిత శాస్తం మరియు విజ్ఞాన శాస్త్రం లో అధికమైన అభిరుచిని కలిగియుండేవాడు. పిల్లవాడిగా పాస్కల్ కు ప్రతీ విషయం తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండేది. ఏదైనా ఒక అద్భుత విషయాన్ని చూస్తే నవ్వి , ఉదాసీనంగా ఉండేవాడు కాదు. అది ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు. తన కుమారుని మేధా పటిమను చూసి తండ్రి ఆశ్చర్యపోయేవాడు. గణిత శాస్త్రం జోలికి పాస్కల్ ను వెళ్ళనీయకూడదని తలంచాడు. గణిత శాస్త్ర అధ్యయనం మనసును నిర్భందించి, వశపరచుకొని మిగతా వాటి మీద ధ్యాస లేకుండా చేస్తుందని ఆయన భయపడేవాడు. అందుకే లాటిన్ మరియు ఇతర భాషల లోని కఠిన మైన పాఠాలను నేర్చుకొనే ఏర్పాటు చేసి గణిత శాస్త్ర అధ్యయనానికి సమయం లేకుండా చేసేవాడు. కాని బ్లెయిజ్ యొక్క సహజసిద్దమైన కోరిక , జిజ్ఞాస వాటినన్నిటిని అధిగమించింది.

 ఆవిష్కరణలు 
 పాస్కల్ తన 16 వ ఏటనే కోనిక్ సెక్షన్స్ ను రచించాడు. ఆర్కిమెడిస్ కాలం తరువాత గణిత శాస్త్రంలో జరిగిన విశిష్టమైన రచన ఇదే అని ఫ్రెంచ్ దేసస్తులంతా అతనిని కీర్తించారు. ఆ తరువాత అతడు కాలిక్యులేటింగ్ మెషీన్ కనుగొన్నాడు. మూడు సంవత్సరాలు పరిశోధన చేసి 50 నమూనా యంత్రాలను, పాస్కలైన్ కాలిక్యులేటర్స్ అని పిలువబడే 20 యంత్రాలను అతడు రూపొందించాడు. పాస్కల్ తన మేధా పటిమతో వాయువుకు బరువు ఉంటుందని, మెర్క్యురీ లెవల్ వాతావరణానికి అనుగుణంగా మారుతుందని కనిపెట్టాడు. దీని ఫలితంగానే సెప్టెంబర్ 19, 1648 లో అతడు ‘బారోమీటర్’ ను ప్రపంచానికి అందించాడు. అప్పటికి పాస్కల్ వయస్సు 20 ఏళ్ళు. ఆ తరువాత అతడు ఎన్నో ప్రయోగాలు చేసి అనుదినం జీవితానికి అవసరమయ్యే అనేక క్రొత్త విషయాలను కనుగొన్నాడు. 

 మతం పై ఆసక్తి 
 1646 లో పాస్కల్ యొక్క తండ్రి జారిపడటంతో ఆయన తుంటి ఎముక విరిగింది. చికిత్స చేయుట కొరకు ఆ దేశంలో ప్రసిద్ధులైన ఇద్దరు వైద్యులు వారి గృహానికి వచ్చేవారు. వారిరువురు కాథలిక్ బోధలలో నిష్ణాతులు. వారితో తరచూ సంభాషిస్తూ బ్లెయిజ్ కూడా కాథలిక్ మతబోథల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆ సమయంలో ఆయన అగస్టీన్ స్థాపించిన శాఖకు పరిచయమయ్యాడు. ఇది అతనిలో జరిగిన మొదటి మార్పుగా పాస్కల్ భావించేవాడు. ఆ తరువాత అతడు కొద్దికాలం పూర్తిగా ప్రక్కకు తొలిగి (1648 – 1654) మధ్యకాలంలో లోకానుసారమైన జీవితం జీవించాడు. 1651లో అతని తండ్రి మరణించాడు. ఒక సోదరి వివాహం చేసుకొని తన భర్తతో వేరొక ప్రదేశానికి వెళ్ళింది. తన చెల్లెలు జాక్విలిన్ఆస్తినంతా పాస్కల్ కు రాసి సన్యాసినిగా పోర్ట్ రాయల్ అనే ప్రదేశానికి వెళ్ళిపోయింది. ఈ సంఘటన పాస్కల్ ను ఎంతో కృంగదీసింది. అతడు పూర్తిగా ఒంటరి వాడయ్యాడు. అతడు ఇహలోక వ్యాపారంలో చిక్కుకొని దేవునికి దూరమయ్యాడు. 

 పునర్జన్మ 
 1654 నవంబర్ 23 సోమవారం పాస్కల్ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. రాత్రి కాల సమయంలో 10.30 నుండి 12.30 గంటల మధ్య అతనికి ఒక దర్శనం కలిగింది. ఆ రాత్రి నిద్రపట్టక బైబిల్ చదువుతూవుండగా అకస్మాత్తుగా ఒక అగ్ని జ్వాల తనను చుట్టివేయడం గమనించాడు. మిరుమిట్లు గొలిపే కాంతికి అతని కళ్ళు మసకబారి పోయాయి. ఆ అద్భుతమైన ఘడియ మాటలలో వివరించలేనిదని అంటాడు పాస్కల్. ఒక అనూహ్యమైన శక్తి అతనిని ఆవరించింది. అతనిలో ఒక వింత ప్రక్రియ ప్రారంభమయ్యి అతని అభిరుచులను ఇష్టాలను రూపుమాపి ఒక నూతన వ్యక్తిగా మార్చింది. దైవ కృప ఆయన హృదయం లోకి వచ్చి గొప్ప కార్యాన్ని చేసింది. తన సోదరి స్వార్ధ రహిత జీవితం కూడా అతడిని తన్మయుడిని చేసింది. అతడు కొంతకాలం తన వైజ్ఞానిక పరిశోధనలన్నీ ప్రక్కన పెట్టి ప్రభువు తనతో మాట్లాడిన ‘ అవసరమైన దానిని ‘ వెదకడం ప్రారంభించాడు. ఈ ఉన్నతమైన అన్వేషణకు తనను తాను అంకితం చేసుకున్నాడు. పాస్కల్ తన పునర్జన్మ అనుభవాన్ని ఇతరులతో పంచుకునేందుకు అనువుగా వెంటనే ‘ ఆన్ ద కన్వర్షన్ ఆఫ్ ద విన్నర్’ అనే పుస్తకాన్ని రాసాడు . “ నా జనులు రెండు నేరములు చేసియున్నారు. తమ కొరకు జీవ జలముల ఊట అయిన నన్ను విడిచి యున్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్ళు నిలువని తొట్లను తొలిపించుకొని యున్నారు” (యిర్మియా 2:13) అనే వచనం ద్వారా దేవుడు తనతో మాట్లాడినట్లు పాస్కల్ తెలియజేసాడు. ఈ మాటలు పాస్కల్ మనస్సులో కలవరం లేపాయి. తానూ బుద్దిపూర్వకంగా ప్రభువు తట్టు తిరిగి నీళ్ళు నిలవని బద్దలైన తొట్లు అనగా కేవలం విజ్ఞాన జీవితంలోనే నిమగ్నమై పరలోకాన్నే మర్చిపోయే అల్పత్వంలో ఉన్నానని గుర్తించాడు. ఆయన పాదాల దగ్గర వదిలిపెట్టిన యే జీవజీల ఊటనైతే (యేసును) ఇంతకాలం వదిలేశాడో ఆ విమోచకుడిని ఆశ్రయించాడు. ఆ దినం నుండి తానూ మరణించేవరకు యేసే సర్వస్వంగా బ్రతికాడు పాస్కల్. 

 పాస్కల్ రచనలు
 1656- 57 మధ్యకాలంలో పాస్కల్ అనేక రచనలు చేసాడు. కాథలిక్ మత పద్ధతులను ఎన్నిటినో పాపపు ఆచారాలుగా కొట్టివేసాడు. అతడు రాసిన 18 ఉత్తరాల సంపుటి ‘ప్రొవిన్షియల్ లెటర్స్’ ఎంతో ప్రాచుర్యం పొందింది. అతని రచనలు ప్రఖ్యాత ఫ్రెంచ్ రచయితలైన వోల్టేర్,రూసో లను కూడా ప్రభావితం చేశాయి. క్రైస్తవ విశ్వాసాన్ని పెంపొందిచుటకు ‘పెన్సిస్’ అని పిలువబడే గ్రంథాన్ని పాస్కల్ రచించాడు . ఇది అతని మరణానంతరం ముద్రించబడింది. తన సహోదరిని తిరిగి రావలసినదిగా విజ్ఞాపన చేస్తూ ఆయన రాసిన రచనలు కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి. వైజ్ఞానిక సంబంధమైన అనేక పరిశోధనలతో కూడిన రచనలు చేశాడు పాస్కల్. ‘ఎస్సేస్ ఆన్ కోనిక్స్’ మరియు ‘న్యూ ఎక్స్పెరిమెంట్ విత్ ద వ్యాక్యుం’ మొదలగు గణిత శాస్త్రం మరియు పదార్ధ శాస్త్రాలకు సంబంధించిన అనేక ఆవిష్కరణలకు సంబంధించిన రచనలను చేశాడు పాస్కల్. 1662 లో పారిస్ నగరంలో యంత్రాలతో నడిచే మొట్ట మొదటి పబ్లిక్ బస్ లైన్ ను నడిపించి యాంత్రిక రంగంలో తనలోని మేధా పటిమను ప్రపంచానికి తెలియజేశాడు. అతని ఆవిష్కరణలతో నాగరిక ప్రపంచానికి బాటలు వేశాడు పాస్కల్ 

 ముగింపు 
 1662 ఆగష్టు 19 న తీవ్ర అనారోగ్యానికి గురై తన 39 వ ఏట ప్రభువు సన్నిధికి చేరాడు పాస్కల్. తన అంతం దగ్గర పడుతున్నప్పుడు ‘నా కోసం శ్రమ పొంది చనిపోవడానికి వచ్చిన విమోచకుడి వైపు నా చేతులు చాపుతున్నాను’ అని పలికాడు. ‘ దేవుడు నన్నెన్నడు విడిచిపెట్టడు’ అన్న అతని చివరి పలుకులు అతని సమాధి మీద చెక్కబడ్డాయి. ఫ్రాన్స్ చరిత్రలో అనేక మంది గొప్ప వ్యక్తులు జన్మించారు కాని వారందరిలో విశిష్టమైన వ్యక్తిగా తన కాంతిని విశ్వమంతటా వెదజల్లాడు పాస్కల్.

Monday, 16 June 2025

Genesis Chapter 44 Quiz

 

1. What did Joseph command his steward to put in Benjamin’s sack?

a) Silver coins
b) Golden bracelet
c) His silver cup
d) A scroll

2. What was placed along with the silver cup in Benjamin’s sack?

a) A loaf of bread
b) The money for the grain
c) A robe
d) A map of Egypt

3. How did the brothers react when the silver cup was found in Benjamin’s sack?

a) They ran away
b) They rejoiced
c) They tore their clothes
d) They blamed Simeon

4. Who spoke to Joseph on behalf of the brothers after the silver cup was found?

a) Levi
b) Reuben
c) Judah
d) Dan

5. What did Judah offer to do for Benjamin?

a) Pay money
b) Take his punishment
c) Bring him to Pharaoh
d) Escape with him

6. What reason did Judah give for protecting Benjamin?

a) He was the oldest
b) Jacob’s life was bound to Benjamin’s
c) Benjamin had a vision
d) Benjamin was betrothed

7. What did Joseph accuse the brothers of when the cup was found?

a) Kidnapping
b) Deceiving Pharaoh
c) Repaying evil for good
d) Lying about their identity

8. What item did Joseph say he used for divination?

a) A staff
b) A robe
c) A silver cup
d) A ring

9. What did the steward accuse the brothers of stealing?

a) Food
b) A donkey
c) A cup
d) Robes

10. How did Joseph respond when Judah pleaded with him?

a) He ignored him
b) He revealed his identity
c) He ordered all of them arrested
d) He sent for Pharaoh


Monday, 9 June 2025

Genesis Chapter 43 Quiz

1. Why did Jacob finally agree to send Benjamin to Egypt?

a) He had a vision
b) Reuben convinced him
c) Judah took responsibility
d) An angel told him

2. What gifts did Jacob instruct his sons to take to Egypt?

a) Livestock and gold
b) Spices, honey, balm, and nuts
c) Grain and silver
d) Incense and wine

3. How did Joseph react when he saw Benjamin?

a) He revealed himself
b) He shouted in anger
c) He hurried away to weep
d) He gave him a new coat

4. Who offered to bear the blame forever if Benjamin was harmed?

a) Reuben
b) Judah
c) Simeon
d) Levi

5. What did the steward say about the silver returned in their sacks?

a) It must be paid again
b) It was a mistake
c) Their God put it there
d) Joseph returned it

6. What was Joseph’s reaction when he dined with his brothers?

a) He sat in silence
b) He seated them by birth order
c) He asked them riddles
d) He preached to them

7. How much more was Benjamin’s portion than the others’?

a) Twice as much
b) Four times as much
c) Five times as much
d) Ten times as much

8. What emotion did Joseph feel when he saw his brother Benjamin?

a) Anger
b) Jealousy
c) Compassion
d) Confusion

9. What did the men fear when they were brought to Joseph's house?

a) That they would be enslaved
b) That Joseph had died
c) That Pharaoh would arrest them
d) That they would be banished

10. What did Joseph instruct his steward to do before the meal?

a) Clean their feet
b) Serve wine
c) Slaughter an animal
d) Bring Pharaoh

Wednesday, 4 June 2025

క్రీస్తు సేవలో క్రికెట్ ఆటగాడు ఛార్లెస్.టి. స్టడ్











సి.టి. స్టడ్ గా పిలువబడే ఛార్లెస్ థామస్ స్టడ్  బ్రిటిష్ దేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు మరియు  మిషనరీ. ఇతడు చైనా, ఇండియా మరియు ఆఫ్రికా దేశాలలో మిషనరీగా పరిచర్య చేశాడు. “ యేసు క్రీస్తు దేవుడై, నా పాపాల నిమిత్తం మరణించినట్లయితే, ఆయన కొరకు నేను చేసే ఏ త్యాగము గొప్పది కాదు” అనే నినాదంతో ఆయన తన క్రీడా జీవితాన్ని వదిలి క్రీస్తు కొరకై జీవించాడు. 

స్టడ్ కుటుంబానికి క్రీస్తు పరిచయం 
ఛార్లెస్ స్టడ్ యొక్క తండ్రి ఎడ్వర్డ్ స్టడ్ నార్త్ ఇండియా లోని ‘టిర్ హట్’ అనే ప్రాంతంలో నీలిమందు (ఇండిగో) తోటలలో ఎంతో ధనాన్ని ఆర్జించి తన మాతృదేశమైన ఇంగ్లండ్ లోని ‘లిటిల్ షైర్’ అనే స్థలములో స్థిరపడ్డాడు. అక్కడ అతడు తన సమయాన్ని క్రికెట్ మరియు గుఱ్ఱపు పందెముల ఆటలతో గడిపేవాడు. ఆ దినాలలో డి.యల్.మూడీ మరియు శాంకీ అనే దైవజనులు ఇంగ్లండ్ లో సువార్తను ప్రకటించసాగారు. తన మిత్రుని కోర్కె పై ఆ సభలకు హాజరయిన ఎడ్వర్డ్ క్రీస్తును తన హృదయంలోనికి ఆహ్వానించాడు. రక్షణ పొందిన తరువాత అతడు తన విలాస జీవితాన్ని విడచి తన ఇంటిలో ప్రార్థనలకై ఒక పెద్ద గదిని ఏర్పాటు చేసి అనేకులు దేవునిలోనికి వచ్చునట్లుగా ఎంతో కృషి చేశాడు.

 క్రికెట్ ఆటగాడిగా స్టడ్  
 ఎడ్వర్డ్ స్టడ్ నకు న్యాస్టన్, జార్జ్, ఛార్లెస్ అను ముగ్గురు కుమారులు ఉన్నారు. వారు ఈటన్ కళాశాలలో చదివేవారు. ఛార్లెస్ ఎక్కువగా ఆటపాటలతో కాలం గదుపుచూ రక్షణను నిర్లక్ష్యం చేశాడు. ఆదివారం మాత్రం భయభక్తులు ఉంటే చాలని భావించేవాడు. ప్రతిదినం ఎక్కువ సమయం క్రికెట్ ను ప్రాక్టీస్ చేయడంలో గడిపేవాడు. ‘బెస్ట్ క్రికెట్ ప్లేయర్’ గా తన కాలేజీలో పేరు తెచ్చుకున్నాడు. ఇతరులను కూడా క్రికెట్ ఆదేవిదంగా ప్రోత్సహించేవాడు. క్రికెట్ ఆట ద్వారా ధైర్యము, స్వార్థ త్యాగము, ఓరిమి మొదలైన సుగుణాలను అతడు అలవరచుకున్నాడు. ఎడ్వర్డ్ స్టడ్ తన కుమారులు దేవుని తెలుసుకోవాలనే ఆసక్తితో వేసవిలో వారి కొరకై ప్రత్యేకంగా సువార్తికులను ఇంటికి ఆహ్వానించి, వారికి దేవుని వాక్యాన్ని భోధించుటకు ప్రయాసపడేవాడు. ఛార్లెస్ అనేకమార్లు సువార్తికులను హేళన చేస్తూ క్రికెట్ ఆటకై వెళ్ళిపోయేవాడు. ఒకనాడు ఒక సువార్తికుడు అతనిని నీవు క్రైస్తవుడవేనా ? అని ప్రశ్నించగా నేను చిన్నతనం నుండే క్రీస్తును విశ్వసిస్తున్నాను. క్రైస్తవ సంఘము పై నాకు విశ్వాసము కలదు అని బదులిచ్చాడు. అంతట ఆ దైవజనుడు యోహాను 3:16 లోని నిత్యజీవం గురించి ఛార్లెస్ కు వివరించాడు. ఆ దినము దేవుడు తనకు ఉచితముగా ఇచ్చిన నిత్యజీవాన్ని స్వీకరించి తన రక్షణ కొరకై కృతజ్ఞతతో దేవుని స్తుతించాడు. ఆ దినము నుండి తనకు బైబిల్ ఎంతో ప్రియమైనదిగా కనిపించిందని ఛార్లెస్ తన రక్షణానుభావము గురించి చెప్పేవాడు. ఛార్లెస్ రక్షణ పొందిన తరువాత అతని సహోదరులిద్దరూ కూడ దేవుని తెలుసుకున్నారు. వీరు ముగ్గురు ఈటన్ కళాశాల లో చదువుచూ తమ తోటి విద్యార్ధుల కొరకై ప్రత్యేక సభలను ఏర్పాటు చేసి వారిని ప్రభువు లోనికి నడిపించాలని ప్రయాసపడేవారు.

 పునరుజ్జీవము 
 స్టడ్ సోదరులు ముగ్గురు క్రికెట్ ఆటలో ప్రఖ్యాతి గడించారు. పేరు ప్రతిష్టలు పెరుగుతుండగా వారిలో ఆధ్యాత్మిక జీవితము చల్లారిపోయి క్రీస్తునందు ఉన్న మెదటి ప్రేమను వదిలేశారు. ఆ దినాలలో ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్ కు స్టడ్ సోదరులు పాల్గొనుటకు వెళ్లారు. అక్కడ ఉండగా జార్జి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. తన సోదరుని పడక వద్ద కూర్చున్న ఛార్లెస్ కు ఈ తలంపు వచ్చింది “ ఈ లోకంలో జార్జికి వచ్చిన కీర్తి వలన ప్రయోజనం ఏమున్నది? ఒకవేళ అతడు లోకాన్ని విడిచి వెళ్ళ వలసివస్తే ఈ లోకభోగములు, పేరు ప్రఖ్యాతులు అతనికి శాంతిని ఏవిధంగా ఇయ్యగలవు?”.” అంతయు వ్యర్థము, సమస్తమును వ్యర్థము” అనే స్వరము అతని ప్రశ్నకు సమాధానంగా వినబడింది. ఆ తరువాత దేవుని కృప చొప్పున జార్జికి సంపూర్ణముగా స్వస్థత కలిగింది. ఇంగ్లండ్ దేశంలోని ప్రార్ధనాపరులైన ఇద్దరు స్త్రీలు వారి కొరకు ప్రార్ధించారు. దాని ఫలితంగా ఛార్లెస్ పునరుజ్జీవింపబడి ప్రభువు సేవ చేయాలని నిశ్చయించుకున్నాడు. అతడు తన స్నేహితులను దర్శించి వారికి రక్షణ సువార్తను భోధించేవాడు. క్రికెట్ ఆటకంటే క్రీస్తును అధికంగా ప్రేమించగలిగాడు. “ఆత్మలను రక్షించునప్పుడు వచ్చే ఆనందంలో ఇహలోక మిచ్చెడి ఆనందంతో  సరితూగదు” అని స్టడ్ చెప్పేవాడు.

 సేవకై పిలుపు 
 ఛార్లెస్ స్టడ్ 1884 వ సంవత్సరంలో బిఎ డిగ్రీ పొందిన తరువాత క్రీస్తును మాత్రమే సేవించాలి అని నిశ్చయించుకున్నాడు. చైనా దేశానికి వెళ్ళమని దేవుడు అతనిని ఆజ్ఞాపిస్తున్నట్లుగా గ్రహించాడు. తనను విడిచి వెళ్ళవద్దని తల్లి కన్నీటితో మొర్ర పెట్టగా ఆందోళన చెందిన ఛార్లెస్ ప్రార్ధించినపుడు “ ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు” అనే దైవాత్మ హెచ్చిరికను విన్నాడు. చైనాకు మిషనరీగా వెళ్ళుటకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. అతనితో పాటు అతని సోదరులు మరో ఆరుగురు సహాధ్యాయులు చైనా వెళ్ళుటకు సిద్ధపడ్డారు. వీరందరినీ ‘కేంబ్రిడ్జి సప్తకము’ అని పిలిచేవారు. వీరికి తన ఆశీర్వాదాలను పంపుచూ విక్టోరియా రాణి ప్రోత్సహించింది. స్టడ్ ప్రసంగిస్తుండగా వేలకొలది విద్యార్ధులు ప్రభువు వద్దకు వచ్చారు. కొంతకాలం ఇంగ్లండ్ లో సేవ చేసిన తరువాత క్రీ.శ 1885 ఫిబ్రవరి నెలలో వారు బయలుదేరి ఏప్రిల్ 1న చైనా దేశాన్ని చేరారు. మార్గమందు ఓడలో తోటి ప్రయాణీకులను, ఓడ పనివారికిని రక్షణ వాక్యము ప్రకటించి వారిని ప్రభువు లోనికి నడిపించాడు.

 చైనాలో సేవ 
 చైనా దేశంలో వారు అక్కడి ప్రజల వలె వస్త్రాలు ధరించి అనేక ప్రాంతాలను దర్శించారు. ఛార్లెస్ ఉత్తర దిక్కునకు ప్రయాణించి 3 నెలలో 1800 మైళ్ళు ప్రయాణించాడు. పడవల మీద, కంచర గాడిదల పై , కాలినడకన ప్రయాణిస్తూ మురికితో నిండిన సత్రాలలో బస చేస్తూ, ఇష్టం లేని ఆహారాన్ని తింటూ చైనా భాషను నేర్చుకున్నాడు. బైబిల్ తప్ప ఇతర పుస్తకాలను చదువుట మాని దైవవాక్యాన్నే ధ్యానించసాగాడు. ప్రతిదినము 40 మైళ్ళు నడచుటచే అతని కాళ్ళకు పుండ్లు వచ్చేవి.
 ఛార్లెస్ హాంగ్ కాంగ్ లో ఉన్నప్పుడు తన సహోదరులకు ఈవిధంగా ఉత్తరం రాసాడు.” మీరు క్రికెట్ గాని, ఇతర ఆటలు గాని ఆడకూడదని నేను చెప్పను. ఆటలయందు క్రీస్తును స్తుతించుచు ఆనందించుడి. కాని ఆటలు నాకు విగ్రహమైయున్నట్లుగా మీకును మరియు క్రీస్తునకు మీ ఆటలు అడ్డురాకుండా చూచుకొనుడి. ఆటల ద్వారా పేరు ప్రఖ్యాతులు గడించుటకును , క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించుటలోను గల వ్యత్యాసాన్ని గమనించండి. కాలము సంకుచితముగా ఉన్నది. గనుక నిత్యనాశనమునకు వెళ్లిపోయే ఆత్మలను సంపాదించుటకు త్వరపడండి”. 
స్టడ్ ఎంతో క్రమశిక్షణ కలిగి ఉండేవాడు. తెల్లవారుజామున 3.30 గంటలకే లేచి ప్రార్థన, వాక్యధ్యానం చేసేవాడు. ఆ సమయం ప్రశాంతంగా ఉండుటచే ప్రభుని స్వరం తప్ప మరి ఏ చిన్న శబ్దం కూడా వినపడదు. ఆ సమయంలో చదివే వాక్యభాగం దినమంతయూ మనస్సులో ముద్రితమై ఉండేది. ఛార్లెస్, హడ్సన్ టేలర్ ను కలుసుకోవడానికి ‘హాన్ చుంగ్’ అనే ప్రదేశానికి వచ్చాడు. కాని విదేశీయులను హత్య చేయుచున్నారని తెలిసికొని చేరువలో ఉన్న ‘చుంకింగ్’ అనే ప్రాంతంలో ఉన్న పందుల గుడిసెలో కొన్ని దినాలు ఉండవలసి వచ్చింది. 

పిత్రార్జితమును ధర్మము చేయుట 
 ఛార్లెస్ కు దాదాపు 29 వేల పౌండ్లు ఆస్తి పిత్రార్జితముగా సంక్రమించింది. ఆ దినాలలో అది సుమారు 4 లక్షల 35 వేల రూపాయలు. ఆయన ఆ ధనాన్ని డి.యల్.మూడీ గారి పరిచర్యకు, జార్జి ముల్లర్ అనాథ శరణాలయానికి, విలియం బూత్ రక్షణ సైన్యానికి, లండన్ పట్టణంలోని పేద ప్రజలకు కానుకగా ఇచ్చేశాడు. మిగిలిన 3,400 పౌండ్లు తాను వివాహం చేసుకోదలచిన ప్రిస్కిల్ల అనే యువతికి కట్నంగా ఇచ్చాడు. కాని ఆమె దానిని నిరాకరించి దేవుడు నీకు కలిగినదంతా బీదలకు ఇమ్మని చెప్పాడు గనుక ఆవిధంగానే చేయమని చెప్పింది. స్టడ్ వివాహానంతరం వారి వద్ద ధనమేమి లేకుండా సంసారాన్ని ప్రారంభించారు. దేవుడు 41 సంవత్సరాలు వారి సంసార నౌకను సురక్షితంగా నడిపించాడు. 

ప్రిస్కిల్ల తో వివాహం :
 ప్రిస్కిల్ల లివింగ్ స్టన్ స్టీవార్డ్స్ అనే ఐర్లాండ్ దేశానికి చెందిన యువతి. ఆమె ఆటపాటలు, నాట్యము మొదలగు లౌకిక వినోదాలయందు మక్కువ కలిగి దేవునికి దూరంగా ఉండేది. ఒక మీటింగ్ లో దేవుడు ఆమెతో “అక్రమము చేయువారలారా నా యెద్ద నుండి వెళ్ళుడి, నేను మిమ్ములను ఎరుగను” అని మాట్లాడగా ఆమె సమాధానము లేని స్థితిలో ప్రార్ధించింది. సిలువ దర్శనాన్ని చూసిన ఆమె క్రీస్తును తన స్వంత రక్షకునిగా స్వీకరించింది. ఆమె బైబిల్ చదువుచుండగా పుస్తకపు అంచులపై చైనా, ఇండియా, ఆఫ్రికా అనే మాటలు లిఖించబడినట్లుగా కనబడింది. ఆమె అనేకులకు తన ఆత్మీయ జీవితం గురించి చెబుతూ పాటలు పాడుచూ వారితో సంభాషిస్తూ ఉండేది. ఆ తరువాత మిషనరీ పరిచర్యకు సమర్పించుకొని 1887 వ సంవత్సరంలో చైనా లోని ‘షాంగై’ కు వెళ్ళింది. ప్రిసిల్లాతో ఛార్లెస్ వివాహం జరగాలని అక్కడి పాస్టర్ నిశ్చయించారు. అది దేవుని చిత్తమని గ్రహించి వారిరువురూ వివాహానికి అంగీకరించారు. చైనాలోని ‘లంగాంగ్-ఫుల్’ (Langang-Fu) అనే పట్టణంలో సేవచేయడానికి వెళ్ళిన స్టడ్ దంపతులకు ఒక శిధిలావస్థలో ఉన్న ఇల్లు అద్దెకు దొరికింది. మంచాలు లేనందున నేలపై పరుండేవారు. ఐదు సంవత్సరాల వరకు ఆ పట్టణ ప్రజలు వీరిని ఎంతో దూషిస్తూ బాధించారు. అక్కడ వచ్చే తెగుళ్ళు, అతివృష్టి, అనావృష్టికి కారణం వీరే అని భావించేవారు. కాని స్టడ్ దంపతులు ఎంతో స్నేహపూర్వకంగా వారితో ఉంటూ క్రీస్తును ప్రకటించేవారు. చెరసాలలో వున్న రోగులను దర్శించేవారు. నల్లమందుకు బానిసలుగా మారిన వారిని ఆ దురలవాటును మాన్పించుటకు ఎంతో శ్రమపడేవారు. వారి వద్దకు వచ్చిన ప్రతిఒక్కరు కొద్ది దినాలకే పూర్తిగా స్వస్థతనొంది రక్షణానందముతో తిరిగి వెళ్ళేవారు. 

కుటుంబ జీవితం 
స్టడ్ దంపతులకు నలుగురు కుమార్తెలు జన్మించారు. వారికి గ్రేస్ అనగా కృప, డోరతి అనగా స్తుతి, ఎడిత్ అనగా ప్రార్థన, పాలినా అనగా సంతోషము అను పేర్లు పెట్టారు. ఎక్కువ కుమార్తెలు కలుగుట నాశన హేతువని తలంచేవారు చైనీయులు. కాని స్టడ్ దంపతులు టం నాల్గవ కుమార్తెకు సంతోషం  అని పేరు పెట్టుట వారిని ఆశ్చర్యపరచింది. అనారోగ్యంతో ప్రిస్కిల్లా మరణ శయ్యపై ఉన్నప్పడు “ మీరు మీ స్వదేశానికి వెళ్ళండని అనేకులు వారికి సలహా ఇచ్చారు. దేవుని సెలవు లేనిదే ఆయన పనిని విడచి వెళ్ళలేమని" స్టడ్ దంపతులు బదులిచ్చారు. సువార్త పరిచర్యకు రాకమునుపు ఛార్లెస్ వైద్య తర్ఫీదు కూడా పొందియుండుటచే తనకు తానే  వైద్యం చేసుకునేవాడు. వారికి ఐదవ కుమార్తె జన్మించి కొద్ది దినాలకే మరణించింది. ఆ సమయంలో స్టడ్ ఇంటి వద్ద లేడు. “ సువార్త సేవలో నన్ను అభ్యంతరపరచెడు ఎట్టి పరిస్థితికైనను నా జీవితంలో తావియ్యను. నేను నా భర్తను అధైర్య పరిచే విధంగా ఒక్క కన్నీటి బిందువును కూడా కార్చను” అని ప్రిస్కిల్లా నిశ్చయించుకుంది. 
స్టడ్ దంపతులు 5 డాలర్లతో తమ సంసారాన్ని ప్రారంభించారు. వారు చైనా దేశపు మధ్య భాగంలో ఉన్నప్పటికి వారి ప్రతి అవసరాన్ని తీర్చుటకు దేవుడు సమర్ధుడని నమ్మారు. ఒకసారి వారి వద్ద ఉన్న భోజనపదార్థాలు అన్నీ అయిపోయినప్పుడు వారు కొంత సమయం ప్రార్ధించి పోస్ట్ మాన్ కొరకు ఎదురు చూడ సాగారు. అతడు వారికి కొన్ని ఉత్తరాలను అందించాడు. చివరలో ఒక కవరు తెరవగా వారికి తెలియని వ్యక్తి పేరుతొ 100 పౌండ్ల చెక్ ఉంది, అతడు దేవుడు తనతో ఆ డబ్బును పంప వలసినదిగా ఒత్తిడి చేశాడు అని తెలియజేసాడు. ఈవిధంగా అనేకమార్లు వారి ప్రతి అవసరమును దేవుడు తీర్చాడు. 

ఇంగ్లండ్ మరియు ఇండియా దేశాలలో పరిచర్య 
స్టడ్ దంపతులు 1894 వ సంవత్సరంలో స్వదేశానికి బయలుదేరారు. ఇద్దరు చైనా యువకులను తమ బిడ్డలకు నర్సులుగా ఉండుటకు మరియు చైనా భాషను నేర్పించుటకు వారితో పాటు ఉంచుకున్నారు. అ యువకులిద్దరూ ఎంతో వేదనతో స్టడ్ కుటుంబానికి వీడ్కోలు పలికారు. రోగ పీడుతులై కృశించిన శరీరాలతో వారు ఇంగ్లండు దేశాన్ని చేరారు. వారిని చూసిన అనేకులు వారిని పోల్చుకోలేకపోయారు. స్వదేశంలో కూడా వారు దేవుని పనిని కొనసాగించారు. 1896 న స్టడ్ అమెరికా దేశానికి అక్కడి వారి ఆహ్వానం మేరకు సువార్త పరిచర్య నిమిత్తం వెళ్ళాడు. అనేకులు అతని ప్రసంగాలు విని రక్షింపబడ్డారు. అనేక మంది విద్యార్థులకు అతడు వ్యక్తిగత పరిచర్య చేశాడు
. ఇండియా దేశానికి వెళ్లి సువార్త ప్రకటించాలనే భారము ఛార్లెస్ లో అధికమయ్యింది. అతని తండ్రి ఎడ్వర్ద్ ఇండియాకు సువార్తికునిగా రావాలని ఆశించాడు. కాని అది సఫలము కాకుండానే మరణించాడు. అతడు 1900 సంవత్సరంలో తన కుటుంబసమేతంగా ఇండియాకు వచ్చాడు. దక్షిణ భారత దేశము లోని ఆంగ్లో ఇండియన్ సంఘము వారు ఆయనను ఆహ్వానించారు. “”స్టడ్ బోధించే గుడికి వెళ్ళవద్దు; వెళ్ళినచో మీరు తప్పక క్రైస్తవులై పోతారు” అనే కొందరు వ్యతిరేకులు ప్రచారము చేయసాగారు. తేయాకు తోటలలో పనిచేసే వారు, మిలటరీ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు మరియు యూరోపియన్ల మధ్య పనిచేశాడు. అప్పుడు మద్రాసు గవర్నర్ గా ఉన్న లార్డ్ ఆంపిల్, స్టడ్ యొక్క క్రికెట్ కీర్తిని ఎరిగినవాడై అనేకమార్లు తన గృహానికి ఆహ్వానించాడు. ఆంగ్లేయ సైనికులు అనేకులు అతనితో క్రికెట్ ఆడటానికి ఇష్టపడేవారు. అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ కూడా అతనితో చాలా స్నేహంగా ఉండేవాడు. క్రికెట్ ద్వారా వారిని ఆకర్షించి రాత్రి పూట వారి కొరకై ప్రత్యేక కూటములు ఏర్పాటు చేసి సువార్తను ప్రకటించాడు. 
1906- 1908 వరకు వారు తిరిగి తమ స్వదేశంలో సువార్త పరిచర్య చేశారు. ఆ తరువాత ఇండియాకు వెళ్లాలని తలంపుతో ఉన్న స్టడ్ దంపతులకు , ‘లివర్ పూల్’ లోని ఒక గోడపై “ఆఫ్రికా ఖండంలో నరమాంసభక్షకులు మిషనరీలను కోరుచున్నారు” అని పెద్ద అక్షరములతో వ్రాయబడిన గోడ కరపత్రాన్ని చూసి స్టడ్ ఆశ్చర్యపోయాడు. ఆ ఇంటి లోపలి కెల్లినప్పుడు ఆఫ్రికాలో సంచరించి తిరిగి వచ్చిన ‘డాక్టర్ కారల్ క్యూమ్’ తన ప్రసంగంలో ఆఫ్రికా దేశంలో సువార్త ప్రకటించాల్సిన అవసరతను గురించి వివరించసాగాడు. క్రైస్తవులెవరును అక్కడకు పోలేదు ఎందుకో అని తనలో తాను ప్రశ్నించుకొనగా దేవుడు ‘నీవే ఎందుకు వెళ్ళకూడదు?’ అని స్టడ్ ని ప్రశ్నించాడు. “నేను వెళ్ళుటకు వైద్యులు అనుమతీయరు” అని స్టడ్ చెప్పగా దేవుడు “నేను మహావైద్యుడను కానా? ఆఫ్రికా దేశములో నిన్ను కాపాడలేనా” సందేహాలకు తావీయక వెళ్ళుము “ అని హెచ్చరించాడు. 50 సంవత్సరాల వయస్సులో, 15ఏళ్లుగా రోగపీడితునిగా ఉన్న అతడు ఆఫ్రికా వేడిని ఏవిధంగా తట్టుకోగలడని అతనికి సహాయం చేయుటకు ఎవరూ ముందుకు రాలేదు. అనారోగ్యముతో ఉన్న ప్రిస్కిల్ల కూడా ఆఫ్రికా వెళ్ళుటకు ఇష్టపడలేదు. స్టడ్ ఒంటరిగా క్రీ.శ 1910 డిశంబర్ 15న ‘లివర్ పూల్’ నుండి బయలుదేరాడు.

 ఆఫ్రికాలో పరిచర్య 
 ఆఫ్రికా లోని సుడాన్ కు చేరిన తరువాత అతడు తన భార్యకు కొన్ని ఉత్తరాలు వ్రాశాడు. క్రీస్తు పరిచర్యలో కలసి పనిచేయాలని ప్రోత్సహించాడు. ఆల్ఫరేడ్ బక్సటన్ అనే ఆంగ్ల యువకుడు , స్టడ్ తో కలసి పనిచేయడానికి ముందుకు వచ్చాడు. వారిద్దరు కెన్యా, ఉగాండా ప్రాంతాలలో సంచరించారు. ఆల్ఫరేడ్ 21 సంవత్సరాల వయస్సువాడు. అంత చిన్న వయస్సులో కాంగో ప్రాంతాలలో ప్రయాణించుట మంచిదికాదని అతని కుటుంబీకులు అతనికి కేబుల్ వర్తమానం పంపారు. కాని కష్టాలలో, శ్రమలలో, మానవులతో సంప్రదించకుండా ప్రభువు నడిపింపుతో వీరిరువురూ ముందుకుసాగారు. వారు 1913 అక్టోబర్ 16న నయగారా ప్రాంతానికి చేరి ‘నాల’ అనే గ్రామంలో కొంత స్థలాన్ని సంపాదించి మిషనరీల కొరకు ఒక ఇల్లును కట్టారు. దానికి ‘బకింగ్ హామ్ ప్యాలస’ అని పేరు పెట్టారు. ఆ ఇంటిలో అనేకమార్లు స్టడ్ ప్రాణాపాయ స్థితి నుండి, విష సర్పాల బారి నుండి తప్పించబడ్డారు. రెండు సంవత్సరాలు పరిచర్య చేసిన తరువాత 1915 వ సంవత్సరంలో స్టడ్ 12 మందికి బాప్తీస్మం ఇచ్చాడు. నైల్ , కాంగో నదుల మధ్య 50 జాతుల వారు ఉన్నప్పటికీ వారంతా ‘బంగళ భాష’ ను మాట్లాడేవారు. విదేశీయులు కూడా ఈ భాషను సులభంగా నేర్చుకోగలరు. ఆల్ఫరేడ్ బంగళ భాషను నేర్చుకొని బైబిల్ ను ఆ భాష లోనికి తర్జుమా చేశాడు. ఆ తరువాత వచ్చిన మిషనరీలకు అది ఎంతగానో ఉపయోగపడింది.
 ఆఫ్రికా మిషన్ : 1914 వ సంవత్సరంలో స్టడ్ ఇంగ్లండ్ కు వచ్చి ఆఫ్రికా మిషన్ ప్రధాన కార్యాలయాన్ని స్థాపించారు. స్టడ్ యొక్క సతీమణి అనారోగ్యంతో మంచానికే పరిమితి అయ్యింది. ఆ స్థితిలో నుండే ఆమె ప్రార్థనా సంఘాలను ఏర్పాటు చేసింది. వైద్యుల సలహాను పాటించకుండా రోజు 30 వరకు ఉత్తరాలు వ్రాసేది. ఒక మాస పత్రికను ప్రచురించేది. ‘మధ్య ఆఫ్రికా మిషన్’ అనే పత్రికను నడుపుటలో ఆమె కుమార్తెలు ఎడిత్, పాలీనాలు ఆమెకు సహాయం చేసేవారు. 
 1916 వ సంవత్సరంలో అతడు అఫ్రికాకు తిరిగి వెళ్లాలని బయలుదేరినప్పుడు ‘స్టడ్ చనిపోతే ఎలా?’ అని చాలామంది ప్రశ్నించారు. దానికి స్టడ్ “ నేను చనిపోయినచో ఒక బుద్దిహీనుడు ఈ లోకంలో తక్కువ అవుతాడు. దేవుడు బ్రతికియున్నంత కాలము ఆఫ్రికా మిషన్ కొనసాగుతూనే ఉంటుంది. దేవుడు ఇంకా అద్భుతాలను చేయనున్నాడు” అని బదులిచ్చాడు. ఆయనతో కూడా అఫ్రికాకు అతని కుమార్తె ఎడిత్ మరో ఎనిమిది మంది అఫ్రికాకు బయలుదేరారు. అన్ని విషయాలలో తన తోటి పనివానిగా ఉన్న ఆల్ఫరేడ్ కు తన కుమార్తె ఎడిత్ తో వివాహం జరపాలని నిశ్చయించాడు. ఆ తరువాత స్టడ్ ఎన్నడూ తన స్వదేశాన్ని గాని, భార్యను గాని చూసే అవకాశం కలుగలేదు. విజయవంతమైన పరిచర్య : ఆల్ఫరేడ్, ఎడిత్ ల వివాహం నయాగరాలో అఫ్రికనుల మధ్య జరిగింది. 
మిషనరీల యొక్క సాక్ష్యాలను ఆశీర్వదించి అనేకులు ప్రభువు తట్టు తిరిగారు. ఆఫ్రికన్ క్రైస్తవులు చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లి తాము తెలిసికొనిన క్రీస్తును ప్రకటించారు. క్రొత్తగా రక్షింపబడిన వారు అనేక మైళ్ళు ప్రయాణం చేసివచ్చి మిషనరీలతో మాట్లాడేవారు. 1920 వ సంవత్సరంలో మరికొందరు మిషనరీలు ఆఫ్రికా సేవకు ఇంగ్లండ్ నుండి వచ్చారు. వారిలో స్టడ్ చిన్న కుమార్తె పాలీనా కూడా ఉంది. ఛార్లెస్ స్టడ్ ‘ఇబాంబి’ రాష్ట్రమునకు వచ్చి క్రొత్తగా అక్కడ పనిని ప్రారంభించాడు. అనేకులు క్రీస్తును నమ్మి బాప్తీస్మం తీసుకున్నారు. స్టడ్ ను వారు ‘భవానా’ అని పిలిచేవారు. ఆ పదానికి ‘పెద్ద దొర’ అని అర్థం. ప్రిస్కిల్లా స్టడ్ తన భర్త వెళ్ళిన తరువాత విశ్వాసం మీదనే ఆధారపడి జీవించుటకు నిశ్చయించుకుంది. ఆమె అనారోగ్యముతో ఉన్నప్పటికీ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాస్మేనియా, దక్షిణాఫ్రికా దేశాలకు వెళ్లి ఆ దేశాలలో మిషన్ కేంద్రాలను తెరచింది.

 ముగింపు 
 ఛార్లెస్ స్టడ్ ఆఫ్రికా దేశంలో ఉన్న క్రైస్తవులందరి కొరకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. స్టడ్ చేసిన సేవ ఫలితంగా రక్షణ లోనికి వచ్చిన దాదాపు 1000 మంది స్త్రీ ,పురుషులు హాజరయ్యారు. వారంతా పరిశుద్ధాత్మ పూర్ణులై పాటలు పాడిన పిమ్మట స్టడ్ ‘అమూల్యమైన ముత్యము’ గురించిన ప్రసంగాన్ని చేశాడు. ఆ దినము వారితో ఎంతో సంతోషంగా గడిపాడు.ఆ తరువాత అతడు మాట్లాడలేకపోయాడు. ‘హల్లెలూయ’ అని మాత్రం పలికేవాడు. మూడు దినాల తరువాత అతడు నిత్య విశ్రాంతి లోనికి వెళ్ళాడు. ‘సైనికుడు’, ‘పరిశుద్ధుడు’ అని వ్రాయబడిన గుడ్డను స్టడ్ దేహం పై కప్పి ‘భవానా’ చూపించిన క్రీస్తు మార్గంలో జీవిస్తామని ప్రమాణం చేశారు వారంతా.






Also Watch ---






Monday, 2 June 2025

Genesis Chapter 42 Quiz

 

1. Why did Jacob send his sons to Egypt?

a) To look for Joseph
b) To escape famine
c) To buy grain
d) To meet Pharaoh

2. Which son did Jacob not send to Egypt?

a) Simeon
b) Levi
c) Benjamin
d) Reuben

3. What did Joseph accuse his brothers of?

a) Being murderers
b) Being spies
c) Being thieves
d) Being rebels

4. How did Joseph speak to his brothers initially?

a) Kindly
b) Through an interpreter
c) In Hebrew
d) In a letter

5. What did Joseph demand to test his brothers?

a) Bring their wives
b) Bring Benjamin
c) Return the grain
d) Reveal their secret

6. Which brother was kept in Egypt as a prisoner?

a) Levi
b) Judah
c) Simeon
d) Zebulun

7. How did the brothers feel when they discovered the silver in their sacks?

a) Happy
b) Confused
c) Afraid
d) Indifferent

8. Who offered his own sons as a guarantee for Benjamin?

a) Judah
b) Reuben
c) Dan
d) Gad

9. What did the brothers recall about Joseph when they were in distress?

a) His coat of many colors
b) His kindness
c) His dreams
d) His cries for help

10. What did Jacob say would happen if harm came to Benjamin?

a) He would die
b) He would curse his sons
c) He would go down to Sheol
d) He would leave the family


Quotes from Famous Scientists about God

  • Albert Einstein -Science without religion is lame, religion without science is blind.
  • Isaac Newton-I have never denied the existence of God. I think the universe is too complex and harmonious to be a result of chance.
  • Galileo Galilei-God is known by nature in his works, and by doctrine in his revealed word.
  • Johannes Kepler-To the Lord whom I worship and thank, That governs the heavens with His eyelid, I return, exalted at His command.

Today's Verse

Visit Elselah Book House


Total Pageviews