Sunday 12 May 2024

అమీ కార్మికేల్ - ఆత్మీయ తల్లి (1861-1951)


1895లో అమీ కార్మికేల్ భారతదేశములో అడుగిడిన వెంటనే దేశానికి అడ్డుగోడగా నిలిచిన మత దురాచారాలను ఎదుర్కొనుటకు సిద్ధపడింది. ఆమె బస చేసిన మిషన్ స్కూల్ వారు యిటువంటి చర్యలను ఊహించి యుండలేదు. హిందువులు కాని, ముస్లింలు గాని మతమును మార్చుకొనిన అనుభవము వారికి తెలియదు. 50 సంవత్సరాలలో ఒకరో యిద్దరో క్రైస్తవ్యము స్వీకరించుట మినహా అక్కడి వారిపై క్రైస్తవ మత ప్రభావము పెద్దగా లేదు. 1901లో యౌవనస్థురాలైన ఆమె దేవాలయములో వుండే బాలబాలికలను కాపాడుట అనే కార్యక్రమమునుప్రారంభించింది. బాలబాలికలను అవినీతికరమైన, నీచమైన ఉద్ధేశ్యముల కొరకు దేవుళ్లతో వివాహాలు జరిపించెడివారు. ఈ విధమైన దురాచారము రూపుమాపుటకు మిషనువారికిని, ప్రభుత్వము వారికినిసాధ్యము కాలేదు. కాని, ఎంతో పోరాటము తరువాత ఆ దురాచారమును అరికట్టగల ఒక చట్టము రూపొందించబడింది.

బాల్య జీవితము 

ఉత్తర ఐర్లాండు దేశమునకు చెందిన ఒక మధ్య తరగతి కుటుంబము నందు అమీ జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఎంతో దైవ భయము కలిగిన ప్రెస్బిటేరియన్ (Presbyterians) శాఖకు చెందినవారు. ఆమె తన చిన్నతనము నుండి కూడా దేవుని యెడల ప్రేమ కలిగినదై తన మూడేండ్ల ప్రాయములో పడకపైననే ఈ విధముగా ప్రార్థించెడిది. 'తండ్రీ దయచేసి వచ్చి నాతో యిక్కడ కూర్చొనుము'. తనకు 16 ఏండ్లు వచ్చునప్పటికీ 'ఆయన హస్తములలోనికి తీసుకొనబడుట' అను అనుభవమును పొందగలిగినది. ఆమె అక్కడనే తన స్థానమును పదిలము చేసుకొని తన భవిష్యత్ జీవితమునంతటిని క్రమపరచుకొనినది. సాంఘిక సేవ పట్ల ఉత్తేజితురాలై, అమీ అనేక కార్యక్రమములను చేపట్టేది. వానిలో మిల్లు కార్మికురాలిగా వుండు బాలికల కొరకు 'వెల్కమ్ హాల్' (Welcome Hall) నిర్మాణము ముఖ్యమైనది. ఇచ్చటనే ఒంటరిగా దేవుని వైపు చూచుట అను సిద్ధాంతమును ఆమె నేర్చుకొనినది. తనకు కావలసిన ఆర్థిక అవసరతల కొరకు తన జీవితకాలమంతయూ అమీ దేవుని పైననే ఆధారపడినది.

కార్మికేల్ కుటుంబము మాన్చెస్టర్ (Manchester) నగరమునకు వలస పోయినప్పుడు అమీ మురికివాడల పనిలో ఆన్కోట్స్ (Ancoats) కు చెందిన ఫ్రాంక్ క్రాస్ (Frank Crosslay) తో కలిసి పనిచేసింది. 1888లో ఆమె మొదటిసారిగా కేస్విక్ కన్వెన్షన్ (Keswick Convention) ను దర్శించింది. దాని సహాయ సంస్థాపకులైన రాబర్ట్ విల్సన్ (Robert Wilson) గారు అప్పటినుండి ఆమె జీవితాంతము వరకూ మంచి మిత్రునిగా వున్నాడు. కేస్విక్ వారు ఆమెను మిషనెరీగా ఎన్నుకొని చైనాకు గాని, ఆఫ్రికాకు గాని పంపవలెనని తలంచిరి. 'తలుపులను తట్టుట' (Knocking on doors) అను కార్యక్రమములో భాగముగా 1893లో ఆమె జపాన్ దేశమునకు ప్రయాణమయ్యింది. కాని ఒక సంవత్సరము తరువాత అనారోగ్య కారణముచే ఇంగ్లండునకు తిరిగి వచ్చింది.

భారతదేశమునకు మిషనరీగా వచ్చుట :

1895లో ఆమె చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ (Church of England) కు చెందిన జెనానా మిషనరీ సొసైటి (Zenana Missionary Society) వారిచే దక్షిణ భారతదేశములోని బెంగుళూరునకు పంపబడింది. ఆమె తిరునల్వెల్లీ జిల్లా (Thirunalvellly District) నందు తన స్థావరమును ఏర్పరచుకొని దక్షిణాది చివరి వరకు రెవరెండ్ వాకర్ (Rev. & Mr. Walker) దంపతులతో కలిసి గ్రామాలలో సువార్త ప్రకటించే కార్యక్రమములను చేపట్టింది. అమీ త్వరలోనే తన చుట్టూ ఉన్న రక్షణ పొందిన స్త్రీలతో ఒక గుంపును ఏర్పాటు చేసింది. దానిని ఆమె నక్షత్రముల సముదాయము లేదా పాలపుంత (Stary Cluster) అని పిలిచెడిది. వారుగ్రామాలకు వెళ్లి అక్కడి గృహాలను దర్శించి, స్త్రీలకు, పిల్లలకు సువార్తను బోధించేవారు. ఒకమారు యిద్దరు గృహముల నుండి తప్పించుకొని వాకర్ దంపతుల వద్దకు రక్షణ కొరకై వచ్చారు. వారందరిపై దౌర్జన్యము, హింస జరుగునను భయముతో వారు  దోనాపూర్ వెళ్లుటకు నిశ్చయించుకున్నారు.

దేవాలయపు బాల బాలికలను సంరక్షించుట

దోనావూర్ నందు 1901లో మొట్టమొదటిసారిగా అమీ ఒక బాలికను ఆలయము నుండి రక్షించింది. కొందరు క్రైస్తవ స్త్రీలకు ఆ బాలిక ఒక రాత్రి సమయములో కనబడింది. ప్రీనా (Preena) అనబడే ఆ బాలిక ఉన్నత కులమునకు చెందినదై ఆ దినమున ఆహారము తీసుకొనకనే నిద్ర కుపక్రమించింది. వారి ఆహారమును తీసుకొనుట ద్వారా తను కుల నియమమునకు భంగము వాటిల్లునని భయపడింది. మరుసటి దినమున ఆ బాలికను అమీ వద్దకు తీసుకొని వచ్చారు. ఆమె ఆ బాలికను తన చేతులలోనికి తీసుకొని ముద్దుపెట్టింది. ఆ బాలికకు ఆమె స్వంత తల్లి స్ఫురణకు వచ్చింది. స్రీనా అప్పటికే ఒకమారు ఆలయము నుండి తప్పించుకొని వెళ్ళింది. కాని ఆమె తల్లిదండ్రులు బలవంతముగా తిరిగి ఆలయములోనికి పంపిరి. ఈ విధమైన తప్పు చేసినందుకు వారు ఆమె రెండు చేతులపై యినుప కడ్డీలతో వాతలు పెట్టారు. కావున ప్రీనా తాను అమీ వద్దనే వుండుటకు యిష్టపడింది.

'ఆలయపు స్త్రీలు, పిల్లలను పట్టుకెళ్లే మిస్సీ అమ్మాళ్ అని ఆమెను పిలువసాగిరి. కానీ అమీ వద్దకు వచ్చిన బాలికకు ఆ చెరకంటే యిక్కడ సంతోషముగా వున్నట్లు తోచినది. కొంతకాలము తరువాత ఆలయపు స్త్రీలు వచ్చి ఆ బాలికను తమతో పంపివేయుమని చెప్పగా, స్రీనా తిరిగి అక్కడకు రానని ఖండితముగా చెప్పింది. ఆ దినము నుండి ఆ బాలికకు అమీ తల్లివలె వ్యవహరించింది. ఆ బాలిక తన జీవితమంతయూ ఆమె వద్దనే గడిపింది. ఆలయములోని జీవితము గురించి తెలిసికొనిన అమీ ఎంతో దిగ్రమ చెందింది. ఆమె యిటువంటి నిస్సహాయులైనబాలలను గురించిన వాస్తవాలను వెలికి తీసింది. వారు బలవంతముగా వ్యభిచారము వైపునకు త్రోయబడుచున్నారని ఆమె గుర్తించింది.

ఆలయమునకు యిచ్చే బాలలు ఎక్కువగా వివాహ జీవితము సరిగా లేని దంపతులకు జన్మించినవారు. వదిలివేయబడిన భార్యలకు జన్మించినవారు. మరికొందరు కొన్ని అనారోగ్యముల నుండి కోలుకొనుటకు తమ కుటుంబము వారిచే దేవునికి బహుమతిగా సమర్పించబడినవారు. ఆలయములో వారికి నృత్యము, సంగీతము మొదలగు వానిలో శిక్షణ నిచ్చేవారు. వారిని దేవుని వూరేగించే సమయములో దీపము మోయుటకు, వింజామరలు విసరుటకు వుపయోగించేవారు. అంతమాత్రమే కాకుండా పురుషులు తమ కోర్కెలు తీర్చుకోవటానికి వారిపై అనేక అత్యాచారాలు చేయడానికి పాల్పడేవారు. యిదంతయూ బహు దుష్టమైన కార్యముగా ప్రకటించుచూ అమీ దీనిని ఖండించెను. ఆమె పరిచర్య గురించి తెలిసినవారు కొంతమంది పసి పిల్లలను ఆలయముల నుండి తప్పించి ఆమె సంరక్షణలోనికి తెచ్చెడివారు. ఆమెతో వున్న స్త్రీల గుంపు ఆమెయొక్క భారమును గమనించి వారునూ పిల్లలను పెంచుటలోను, శిక్షణ నిచ్చుటలోను అమీకి తగు సహాయ సహకారములను అందించిరి.



దోనావూరు సహవాస ప్రారంభము

అమీ దోనావూరునకు వెలుపల ఒక అనువైన స్థలము కొనుగోలు చేసి ఒక భవనమును నిర్మించెను. ఎక్కువమంది పిల్లలు వచ్చుట ఆరంభము కాగానే వసతి గృహాల సంఖ్యను కూడా పెంచి జిల్లా అంతటా అనేక క్రొత్త కేంద్రములను ప్రారంభించిరి. వాటిలో ఒకటి కీలకమైనదిగా గుర్తింపబడి నెయ్యూరు (Neyyoor) లోని లండన్ మిషనెరీ హాస్పిటల్ సమీపమందు ఏర్పాటు చేయబడెను. 1906వ సంవత్సరానికి వారి గృహాలలో 70 మంది బాలలు వుండిరి. అప్పట్లో ప్రబలిన అతిసార వ్యాధి మూలమున వారిలో 10 మంది మరణించిరి. 1913 నాటికి వారి సంఖ్య 140కు పెరిగినది. ఆమెయొక్క ప్రణాళికలలో భాగంగా అడవి యందలి గృహము (Forest House) కూడా చేర్చబడినది. దోనావూర్ నకు  ఎగువన పర్వతములపై గల అడవులలో కార్మికులు, వారి పిల్లల కొరకు కార్యక్రమమును ఏర్పాటు చేసినది. శారీరకముగా, మానసికముగా వికలాంగులైన బాలల కొరకు ప్రత్యేకమైన గృహములను నిర్మించినది. అవి అందమైన ప్రదేశములో పర్వతములు మరియు సముద్రము కానవచ్చునట్లుగా నెలకొల్పబడినవి. అన్నిటికంటే బృహత్తరమైన పథకముగా ఆసుపత్రి భవనములు నిర్మించబడినవి. అవి 'పరలోక స్వస్థత స్థలము' (Place of Heavenly healing) గా పిలువబడినవి.

ప్రార్థనా జీవితము 

ఆమె జీవితమంతయూ ప్రార్థన అను పాఠశాలలో అభ్యసించుచునే గడిపెను. బెల్ఫాస్ట్ (Belfast) నందు తాను గడిపిన బాల్య జీవితము నుండి కూడా దేవుని నమ్ముకొనుటలోని రహస్యమును కనుగొనెను. ప్రార్థనలో తప్ప ఎక్కడా ఎటువంటి విన్నపమును చేయకయే ఆమె తన అవసరతలను అన్నిటిని తీర్చుకొనగలిగెను. ఆమె యొక్క డైరీ అంతయూ తన ప్రార్థనలకు వచ్చిన జవాబులతో నిండిపోయెడిది. ఆసుపత్రి నిర్మించునపుడు పనివారు మరియు బాలబాలికలు అందరూ కలిసి పది వేల రూపాయిల కొరకు ప్రార్థించిరి. ఈ విషయమై అమీ ఒక పుస్తకములో ఈ విధముగా వ్రాసినది. 1 యోహాను 5:14-18 ప్రకారముగా అడిగిన వాటిని పొందగలిగితిమి. పదివేల రూపాయిలు పరలోక స్వస్థత స్థలము కొరకు అనుగ్రహించబడెను. యిందులో వారందరి సంతకములు కూడా సేకరించబడినవి.

దోనావూర్లో నిర్మించబడిన ఆసుపత్రి అక్కడి బాలబాలికలు వైద్య పరిచర్యలో శిక్షణ పొంది, సువార్తికులుగా, ఆత్మల పట్ల ప్రియమైన వారిగా చేయుటలో తోడ్పడెను. మొదటి దినాలలో దోనావూర్లో జరుగు పరిచర్య పట్ల ఆకర్షితులై ప్రపంచమంతటి నుండి అనేకులు సహాయకులుగా ఉండుటకు వచ్చిరి. వారిలో కొందరు మధ్యలోనే విడిచిపెట్టిరి. కొంతమంది ఆత్మీయముగా దిగజారుట వలన మరికొందరు శారీరక శ్రమను తట్టుకొనలేక తిరిగి వెళ్లిపోయిరి. 1925లో అమీ CEZMS సంస్థకు రాజీనామా చేసెను. ఆమె ఆ సంస్థకు చెందినదైనప్పటికీ వ్యక్తిగతముగా తన కార్యక్రమములన్నియు చేసెనని మనము గ్రహింపగలము. ఆ విధముగానే అమీ దోనావూర్ సహవాసమును కూడా నెలకొల్పినది. నైతిక పతనము నుండి బాలలను రక్షించి, ఇండియాలో ప్రజలకు దేవుని ప్రేమను తెలియపర్చుట దాని ముఖ్య ఉద్దేశ్యము. అమీ ఒక కుటుంబ వ్యవస్థను అక్కడ రూపొందించగలిగెను. ఆమె 'అమ్మ' అని వారిచే పిలువబడెను. ఆమె పిల్లలకు స్వయముగా స్నానము చేయించి అనారోగ్యముగా వున్నప్పుడు పరిచర్య చేసెడిది. వారితో కలిసి ఆటలు ఆడుతూ దగ్గరున్న అడవికి వ్యాహ్యాళికై తీసుకొని వెళ్లెడిది. అక్కడ వారికి జంతువులను ప్రేమించుటను, ప్రకృతి విషయమై దేవుని మహిమపరచుటను వారికి బోధించెడిది.


ముగింపు 

1931 అక్టోబరు మాసము 24వ తారీఖున ఉదయకాల సమయములో అమీ తన కార్యక్రమముల విషయమై దేవుని సన్నిధిలో గడిపింది. 'నీవు కోరిన విధముగా నన్ను చేయనిమ్ము. ఈ నా ప్రియమైన వారికి సహాయము చేయు విధముగా వుండుటకై వారికి వుపయోగకరముగా నన్ను మలచుము' అని ఆమె మొఱ్ఱపెట్టింది. మధ్యాహ్నమున ఆమె పడుట వలన కాలు విరిగింది. మరియు అనేకమైన క్లిష్టమైన అనారోగ్య సమస్యలచే 36 సంవత్సరములు మంచము పైననే వుండవలసి వచ్చింది.

మిగిలిన 20 సంవత్సరములలో అమీ ఎక్కువగా తన గదిలోనే వుండిపోయింది. అయినప్పటికి తన పడకలోనే ఒక్కోమారు ఆమె అమ్మగా కర్తవ్యములను నిర్వర్తించెడిది. ఉత్తరముల ద్వారా యితరులతో సంబంధము కలిగివుండేది. ఆ విధముగా ఆమె అనేక ఉత్తరములు వ్రాసింది. అప్పటికే అనేక పుస్తకములను రచించిన అమీ ఈ కాలములో మరి 13 రచించింది. తన యితర ప్రచురణలను కూడా సవరించింది. అమీ ప్రారంభించిన కార్యము దేవుని ప్రేమను వెల్లడి చేయుచూ యింకనూ కొనసాగింపబడుచున్నది. ఆమె ఆనాడు పెంచిన పిల్లలందరూ ఇప్పుడు పెద్దవారై ఆమె యొక్క స్వప్నములను సాకారము చేయుచున్నారు. ఇండియాలో ఆమె గడిపిన జీవితమంతటిలోనూ యుద్ధరంగములో పోరాడుచుంటినను దృక్పథమును కలిగి ‘క్రీస్తు నెరుగుట అనగా ఆయన యొక్క పునరుత్థాన శక్తిలో మరియు శ్రమలలో పాలు పొందుటయేఅను సత్యమును అమీ నేర్చుకున్నది.









Quotes from Famous Scientists about God

  • Albert Einstein -Science without religion is lame, religion without science is blind.
  • Isaac Newton-I have never denied the existence of God. I think the universe is too complex and harmonious to be a result of chance.
  • Galileo Galilei-God is known by nature in his works, and by doctrine in his revealed word.
  • Johannes Kepler-To the Lord whom I worship and thank, That governs the heavens with His eyelid, I return, exalted at His command.

Today's Verse

Systematic Theology in Telugu

Visit Elselah Book House


Total Pageviews