Saturday 14 September 2024

తెలుగు క్రైస్తవ కవి సార్వభౌముడు – కీ.శే.పురుషోత్తమ చౌదరి (1803-1890)

 

పురుషోత్తమ చౌదరి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. క్రైస్తవ మత ప్రచారం కొరకు అనేక కావ్య రచనలు చేసిన తొలి తెలుగు కవి. అనేక క్రైస్తవ పద్య కృతులను, కీర్తనలను రచించి తెలుగు క్రైస్తవ కవి సార్వభౌముడుగా ఖ్యాతిని పొందాడు. తాను రాసిన కీర్తనలను స్వయంగా గానం చేస్తూ ఆంధ్ర , ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాలలో సువార్తను ప్రకటించాడు. ఆయన పేరు వినని మరియు ఆయన పాట పాడని తెలుగు క్రైస్తవుడు ఉండడు అనుటలో అతిశయోక్తి లేదు. 

  బాల్యం మరియు కుటుంబ సాంప్రదాయాలు : 
 పురుషోత్తమ చౌదరి 1803 సెప్టెంబర్ 5 వ తేదీన పశ్చిమ బెంగాల్ లోని గంజాం జిల్లా మదనాపుర గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కూర్మానాద చౌదరి మరియు సుభద్రాదేవి చౌడ రాణి. వీరి పూర్వీకులు పశ్చిమ బెంగాల్ నుండి ఒరిస్సా ప్రాంతానికి వచ్చి స్థిరపడిన బెంగాల్ బ్రాహ్మణులు. తమ మతాచారాల ప్రకారంగా ఏడు సంవత్సరాల వయస్సులోనే ఆయనకు ఉపనయనం జరిపి , గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించారు. బాల్యం నుండే పురుషోత్తమ చౌదరి మత నిష్ట కలిగి ఉండేవారు. నిరంతరం విగ్రహారాధన, తీర్థయాత్రాలతో పాటు తన భుజాల పై వైష్ణవ సుచకాలైన శంఖు చక్రాలను కూడా కాల్పించుకున్నాడు. 1823 లో ఆయన వివాహం తన మేనమామ కుమార్తెయైన రాదామణి దేవిని వివాహం చేసుకున్నాడు. సంస్కృతం, ఒరియా, తెలుగు భాషలలో ప్రావీణ్యతను సంపాదించి 20 సంవత్సరాల వయస్సులోనే కవిత్వం రాయడం ప్రారంభించాడు. క్రైస్తవ్యాన్ని స్వీకరించక మునుపు కూడా చాలా హైందవ మత సంబంధిత భక్తి రచనలను చేశారు.

  క్రీస్తుతో పరిచయం :
పురుషోత్తమ చౌదరి తన అన్నగారైన జగన్నాధ చౌదరి వద్ద కొంతకాలం పనిచేశారు. అప్పుడే ఆయనకు క్రైస్తవ్యం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. ఆ సమయంలో ఆయనకు విలియం కేరీ తెలుగులో ముద్రించిన కరపత్రం లభించింది. అది చదివిన తరువాత మరింత ఆసక్తి పెరిగి అక్కడి మిషనరీలైన హెలెన్ నాట్ , విలియం డాసన్ లను కలిశారు. అప్పటికే రెవ.ప్రిచెట్ 1818 లో తెలుగులో అనువదించిన నూతన నిబంధన ప్రతి ఆయనకు అందింది. వాక్యాన్ని చదివిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు బయల్పరచడటంతో ఆయనలో విశ్వాస కార్యం జరిగింది. తాను అంతవరకు అనుసరిస్తున్న మతాచారాలు, విగ్రహారాధన, తీర్థయాత్రలు తప్పు అని గ్రహించారు. 1833 అక్టోబర్ 6 న క్రీస్తును అనుసరించాలని నిర్ణయించుకున్నారు. తన తోటి క్రైస్తవులతో కలిసి ఆరాధిస్తూ “మా యేసు క్రీస్తుని – మరుగు గల్గెనురా నా యాత్మ ఘన రక్ష – నగము నెక్కెనురా “ అనే కీర్తనను పాడారు. అది తెలుగులో వెలువడిన మొదటి క్రైస్తవ గీతం.

  క్రైస్తవునిగా ఎదుర్కొనిన శ్రమలు : 
పురుషోత్తమ చౌదరి క్రైస్తవుడు అయిన తరువాత కుటుంబ సభ్యుల నుండి మరియు తన గ్రామస్తుల నుండి ఎన్నో శ్రమలను పొందారు. ఈ శ్రమలు ఆయనలో నిరాశ కలిగించక తాను పొందిన రక్షణానుభవాన్ని ఇతరులకు ప్రకటించాలనే తృష్ణను పెంచాయి. 1836 ఏప్రిల్ 3 న ఆయన భార్య కూడా క్రీస్తును అంగీకరించింది. ఆ సంవత్సరమందే పురుషోత్తమ చౌదరి మిషనరీగా అభిషేకం పొందారు. అనేక శ్రమలు, తిరస్కారాలకు గురైనప్పటికీ, విశ్వాసంలో వెనుకడుగు వేయకుండా వేలకొలది మైళ్ళు కాలినడకన ప్రయాణించి ఆంధ్ర దేశం అంతటా పర్యటించి విస్తృతంగా పరిచర్య చేశారు. 

  క్రీస్తు పరిచర్యలో పండితుడు :
పురుషోత్తమ చౌదరి పర్లాకిమిడి లో ట్యూటర్ గా పనిచేస్తున్న కాలంలో హెలెన్ నాట్ అనే మిషనరీ లూకా సువార్త మరియు రెండు కరపత్రాలను ఇచ్చారు. ఆయన పురుషోత్తమ చౌదరిని మద్రాసు పంపాలని తలంచినప్పటికీ కటక్ లోని బాప్టిస్ట్ సంఘ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లారు. 1834 లో బ్రెట్ గారి తో కలిసి ఒరిస్సా, ఆంద్ర మరియు కర్ణాటక లోని భళ్ళారి ప్రాంతాలలో పర్యటించి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. తాను రచించిన ‘సువార్త బూర’ పద్య కావ్యాన్ని కూడా వెయ్యి కాపీలు ముద్రించి ప్రజలకు పంచిపెట్టారు. ఆయన ప్రసంగాలలో ప్రాముఖ్యంగా “ గుడ్డివాడు వేరొక గుడ్డి వానిని నడిపించలేడు, ఆ విధంగానే పాపంలో నిండిన దేవతలు పాపులను రక్షించలేవు “ అని ప్రకటించేవారు. ఈయన విశాఖపట్నం మరియు చుట్టుప్రక్కల గ్రామాలలో సువార్త పరిచర్యను చేశారు. మరియు తన బంధువులు , గ్రామస్తులు వెలివేసినప్పటికీ పర్లాకిమిడి మరియు దాని చుట్టు ప్రక్కల గ్రామాల్లో సువార్తను అందించారు. తెలుగు ప్రజల మద్య ఆయన చేసిన పరిచర్యకు సంతృప్తి చెందిన మిషనరీలు ఆయనను గంజాం జిల్లా లో పాస్టర్ గా నియమించారు. అక్కడ ఆయన 7 సంవత్సరాలు నివసించి పరిచర్య చేశారు. తరువాత 6 సంవత్సరాలు చిరాకోల్ నందు పరిచర్య చేశారు. 1851 లో తన భార్య మరణించిన తరువాత ఆయనను విశాఖపట్నం బదిలీ చేశారు. అక్కడ బైబిల్ అనువాదంలో మిషనరీలకు సహాయపడుతూ అనకాపల్లి, యలమంచిలి, తుని, పీతాపూర్, సామర్లకోట , పెద్దాపురం, కాకినాడ మొదలగు ప్రాంతాలలో సువార్తను ప్రకటించారు. 18౫౨ లో చిట్టివలస లో సువార్త ప్రచారకునిగా ఉంది భీమిలి పట్నం మరియు పోలేపల్లిలో ఆదివారం సాయంత్రాలు పరిచర్య చేసేవారు. ఈ కాలంలో ఆయన కుటుంబ సభ్యులలో అనేకులు ప్రభువుని విశ్వసించి బాప్తీస్మం తీసుకున్నారు.

  క్రైస్తవ సాహిత్య సంపద : 
 పురుషోత్తమ చౌదరి మొత్తం 130 వరకు భక్తి గీతాలను రచించి క్రైస్తవ లోకానికి కానుకగా ఇచ్ఛారు. ఈ పాటలన్నీ భక్తి పూరితమైనవే కాక , సాహితీ సంపదతో నిండి వుంటాయి. ఈ పాటలన్నీ దైవారాధనలోనే కాదుగాని మన ఆత్మా పరిశీలనకు కూడా ఎంతో ఉపకరిస్తాయి. పురుషోత్తమ చౌదరి రక్షణ చరిత్ర , నిస్తార రత్నాకరము అనే రూపకాలను క్రీ.శ 1846 లో రచించారు. ఇది తెలుగు సాహిత్యంలోనే మొట్టమొదటి క్రైస్తవ సంగీత రూపకాలు. ‘ సత్య భజన’ పేరిట ఒక భజన గీతాల సంకలనాన్ని 1874 లో రచించారు. ఈ భజన గీతాల గ్రంథాలలో ప్రతి కీర్తనకు ముందు తెలుగు వర్ణమాలలో ఒకొక్క అక్షరాన్ని అక్షర క్రమంలో ప్రారంభాక్షరంగా ఉపయోగిస్తూ కంద పద్యాలను రచించారు. ఈయన అనేక పద్య కావ్యాలను రచించారు. వాటిలో రెండు శతకాలు, యేసునాయక శతకము మరియు యేసు క్రీస్తు ప్రభు శతకము అనువాటిని రచించారు. ‘పంచ రత్నములు’ అనే సీస పద్యాల సంకలనం , క్రైస్తవ నీతి ప్రకాశము మరియు సత్యవేద సారము , కులాచార పరీక్ష అనే పద్యకావ్యాలను రచించారు. క్రీ.శ 1845 లో రచించిన ‘యేసు నాయక శతకము ‘ తెలుగు శతక వాజ్మయంలో మొట్టమొదటి శతకం. ఆయన తన రచనలలో విగ్రహారాధనను ఖండించారు. ఆయన రాసిన ప్రతీ పాట తన స్వీయ జీవితానుభవ లోతుల్లో నుండి పెల్లుబికినదే. అందుకే ఈనాటికీ తెలుగు క్రైస్తవ సాహిత్యంలో అవి సజీవంగా నిలిచాయి. పురుషోత్తమ చౌదరి జీవితం పై , ఆయన పాటలలోని సంగీత సాహిత్యాల పై అనేక పరిశోధనలు చేశారు. 
ఈ కవి వ్రాసి గానం చేసిన కొన్ని కీర్తనలు –
 మంగళమే యేసునకు – మనుజావాతారునకు 
 దాసుల ప్రార్థన దప్పక యొసిగగెడు 
 నన్ను గన్నయ్య రావే నా యేసు – నన్ను గన్నయ్య రావే నా ప్రభువా 
 త్రాహిమం క్రీస్తు నాథ – దయజూడ రావే 
 యెహోవా నామొర లాలించెను
 ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద – సన్నిధికో రక్షకా
 రారే మన యేసుస్వామిని – జూతము కోర్కెలూర 
 యేసు నామమే పావనము మాకు – యేసే గదా నిత్య జీవనము
‘ పయనమై యున్నానయ్య ’ అనే పాట పురుషోత్తమ చౌదరి రచించిన చివరి కీర్తన. 

  ముగింపు : 
 పురుషోత్తమ చౌదరి 18 రోజులు కాలినడకన పాటలు పాడుకుంటూ మద్రాసు వరకు వెళ్లారు. 150 ఏళ్ల క్రితం శ్రీకాకుళం లోని తెలుగు బాప్టిస్టు చర్చిని ఆయన స్వహస్తాలతో నిర్మించారు. ఆయన భార్య శ్రీకాకుళం లోనే మరణించారు. ౬౭ ఏళ్ల వయస్సు వరకు ఆంద్ర దేశంలోనే ఉండి , జీవిత చరమాంకాన్ని కటక్ లోని తన పిల్లల దగ్గర గడిపారు. 1852 లో కనుచూపు పూర్తిగా మందగించిన సమయంలో తన కుమార్తెను పిలిపించుకొని ‘‘సకలేంద్రియములారా – చాలు మీ పని దీరె ‘ అనే పాటను పాడి ఆమెచే వ్రాయించారు. చివరకు 1890, ఆగష్టు 26 న తన 87 వ ఏట ప్రభువు సన్నిధిని చేరుకున్నారు. పురుషోత్తమ చౌదరి గారిని తెలుగు క్రైస్తవ లోకానికి దేవుడు అనుగ్రహించిన బహుమతిగా భావించవచ్చు. ఇప్పటికీ వివిధ సంఘాలలో ఆయన రాసిన కీర్తనలను ఆలపిస్తారు. హైందవ సాహిత్యంలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజుల వలె క్రైస్తవ భక్తి సాహిత్యంలో ఆధ్యాత్మిక ప్రచారం చేసిన వాగ్గేయకారునిగా పురుషోత్తమ చౌదరి పేరు క్రైస్తవ లోకంలో చిరకాలం దేవుని మహిమార్థమై నిలచి ఉంటుంది. యూ ట్యూబ్ లోని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలను విని నేర్చుకొని కుటుంబ ఆరాధనలలో ఆలపించి ఆత్మీయ మేలులను పొందాలని ఆశిస్తున్నాను. పురుషోత్తమ చౌదరి జీవిత చరిత్రను ఆయన మనుమడైన జాన్ చౌదరి రచించారు. అంతేకాకుండా ఆంద్ర వేదాంత కళాశాలలో ప్రొఫెసర్ గా ఉన్న రావెల జోసఫ్ గారు కూడా ‘ Bhakti Theology of Purushottam Choudari ‘ అనే పుస్తకాన్ని రచించారు.

Saturday 7 September 2024

Genesis Chapter 30 Quiz


  1. Jacob
    Cain
    Isaac
    Reuben

  2. One
    Two
    Three
    Four

  3. Dan and Naphtali
    Asher and Gad
    Reuben and Simeon
    Issachar and Zebulun

  4. A wife
    A servant
    A concubine
    A friend

  5. Two
    Four
    Five
    Six

  6. Asher and Gad
    Dan and Naphtali
    Issachar and Zebulun
    Reuben and Simeon

  7. A necklace
    A dress
    A night with Jacob
    Money

  8. Judah
    Reuben
    Simeon
    Levi

  9. His idols
    His sheep
    His gold
    His clothes

  10. Fourteen
    Twenty
    Twenty-four
    Thirty

```

Saturday 24 August 2024

Genesis Chapter 29 Quiz

 


  1. Rachel
    Leah
    Zilpah
    Bilhah

  2. His wife
    His daughter
    His sister
    His servant

  3. He kissed her
    He gave her a gift
    He proposed marriage
    He watered her flock

  4. He would work for Laban for seven years
    He would give Laban all his possessions
    He would build Laban a house
    He would serve Laban as a slave

  5. He gave Jacob a feast
    He revealed Leah as the bride instead
    He blessed the couple
    He gave Jacob a dowry

  6. It was the custom in their land
    Leah was older
    Leah was more beautiful
    Leah wanted to marry Jacob

  7. Seven
    Ten
    Twelve
    Fifteen

  8. A house
    A servant
    A dowry
    A handmaid

  9. Three
    Five
    Seven
    Nine

  10. She wept
    She left Jacob
    She prayed
    She rejoiced

Thursday 15 August 2024

నారాయణ్ వామన్ తిలక్ (1861-1919)


                                  


క్రైస్తవ మరాఠీ కవి

నారాయణ్ వామన్ తిలక్ ఆధునిక మహారాష్ట్ర చరిత్రలో చెరగని ముద్ర వేసిన 19వ శతాబ్దపు క్రైస్తవ మరాఠీ కవి. అతడు  మహారాష్ట్రకు చెందిన ఐదుగురు ప్రముఖ కవులలో (పంచ కవి) ఒకనిగా పరిగణించబడ్డాడు. మరాఠీ క్రైస్తవ సమాజంలోనే కాకుండా మరాఠీ సాహిత్యంలో కూడా గౌరవనీయమైన స్థానాన్ని పొందాడు. ప్రకృతిపై తిలక్ రచించిన పద్యాలు మహారాష్ట్రలోని పాఠశాలల్లో ఇప్పటికీ బోధించబడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అతడు  క్రీస్తును విశ్వసించిన తర్వాత మరాఠీలో రాసిన కీర్తనలు ఈనాటికీ క్యాథలిక్ మరియు ప్రొటెస్టంట్ చర్చిలలో పాడబడుతున్నాయి.

తిలక్  కుటుంబ జీవితం

నారాయణ్ తిలక్ 6 డిసెంబర్, 1861న కొంకణ్ ప్రాంతంలోని తన తల్లితండ్రుల గ్రామమైన కరంజ్‌గావ్‌లో జన్మించారు. పండిత రమాబాయి వలె,  తిలక్ కూడా చిత్పవన్ బ్రాహ్మణ సమాజానికి చెందినవారు. అతను నాసిక్‌లో సంస్కృతం అభ్యసించాడు మరియు 1880లో మనుబాయి (మణికర్ణిక) గోఖలేను వివాహం చేసుకున్నాడు. ఈ మనుబాయి వివాహం తర్వాత లక్ష్మీబాయి అని పేరు పెట్టబడింది మరియు మరాఠీ సాహిత్యంలో అత్యుత్తమ స్వీయచరిత్ర రచయితలలో ఒకరిగా గుర్తించబడింది.

ఉద్యోగ జీవితం మరియు క్రీస్తుతో పరిచయం

వారి వివాహం తర్వాత పదకొండు సంవత్సరాల పాటు తిలక్ నాగ్‌పూర్, ముంబై, వాణి మరియు ముర్బాద్ వంటి ప్రదేశాలలో కీర్తంకర్ గా , ఉపాధ్యాయునిగా  వివిధ ఉద్యోగాలు చేసారు. 1883 లో అతను మతానికి అంకితమైన 'రిషి' అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. ఒకసారి ఒక క్రైస్తవుడు అతనికి పవిత్ర బైబిల్ కాపీని అందించాడు, ఆ తర్వాత అతడు  క్రీస్తును గూర్చి అధ్యయనం చేయడంలో ఆసక్తిని పెంచుకున్నాడు. క్రమంగా, అతను యేసుక్రీస్తును ఇష్టపడటం ప్రారంభించాడు మరియు 1895లో ఆయనను తన స్వంత రక్షకునిగా  స్వీకరించాడు. అతను తన శేష జీవితాన్ని యేసుక్రీస్తు సేవకు అంకితం చేశాడు.

మరాఠీ క్రైస్తవ సమాజంలో పరిచర్య

మరాఠీ క్రైస్తవులు తమ స్థానిక సామాజిక-సాంస్కృతిక సంప్రదాయాలను వదులుకోకుండా క్రీస్తును అనుసరించడం సాధ్యమేనని తిలక్ తన స్వంత ఉదాహరణతో నిరూపించారు. అతను యేసు-కేంద్రీకృత భజనలు, కీర్తనలు మరియు ఇతిహాసాలు కంపోజ్ చేయడం ద్వారా వారి ఆధ్యాత్మిక అవసరాలను తీర్చాడు. 19వ మరియు 20వ శతాబ్దాలలో వేలాది మంది క్రైస్తవ మతాన్ని స్వీకరించిన అహ్మద్‌నగర్, పూణే, నాసిక్ మరియు ఔరంగాబాద్ జిల్లాలలోని చర్చిలలో పాశ్చాత్య ఆరాధనలను నిరోధించడంలో ఇది చాలా వరకు సహాయపడింది.

తిలక్ సతీమణి లక్ష్మీబాయి క్రీస్తును విశ్వసించుట

లక్ష్మీబాయి యొక్క 'స్మృతిచిత్రే' , సంస్కృత పండితుడైన భర్త క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పుడు  ఆమెలో జరిగిన అలజడిని  వివరిస్తుంది. అతను మతం మారిన తర్వాత అతని దగ్గరి బంధువులు మరియు సమాజంచే బహిష్కరించబడ్డాడు మరియు దాదాపు నాలుగు సంవత్సరాలు అతని భార్య మరియు కుమారుడు దేవదత్తా నుండి దూరంగా ఉండవలసి వచ్చింది.

1890లో, లక్ష్మీబాయి తన కుటుంబ సభ్యులను ధిక్కరించి, కుమారునితో తన భర్త వద్దకు వచ్చింది. అయినప్పటికీ, ఆమె తర్వాత కూడా కొంత కాలం పాటు తన సాంప్రదాయక ఆచారాలను కొనసాగించింది మరియు అంటరాని ఇతర దిగువ కులాలకు చెందిన వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉండటానికి నిరాకరించింది.

ఒకసారి, తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది మరియు లక్ష్మీబాయి ఒక ముస్లిం మహిళ ఇచ్చిన నీటిని తాగవలసి వచ్చింది. క్రమంగా, లక్ష్మీబాయి అంటరాని వర్గాల ప్రజలు అందించే ఆహారాన్ని స్వీకరించడం ప్రారంభించింది. తన భర్తతో చేరిన ఒక సంవత్సరం తర్వాత, ఆమె కూడా క్రీస్తును తన రక్షకునిగా అంగీకరించింది . తమ జీవిత చరిత్రను  మరియు 19వ శతాబ్దపు మహారాష్ట్రలో ఉన్న సామాజిక పరిస్థితులను అద్దం పట్టేలా లక్ష్మీబాయి ‘స్మృతిచిత్రే’ అనే తన  స్వీయ చరిత్రలో వివరించారు.

తిలక్ వ్యక్తిత్వం

తిలక్ వ్యక్తిత్వాన్ని ‘స్మృతిచిత్రే’ లేకుండా పూర్తిగా అర్థం చేసుకోలేము. వివాహితుడైనప్పటికీ, తిలక్ ఒక సన్యాసి వలె  భౌతిక అంశాల పట్ల తక్కువ శ్రద్ధ చూపేవారు. అతడు ఒక  నిజమైన  'క్రైస్తవుడు'. సమాజంలోని అణగారిన వర్గాల పట్ల దయగలవాడు, తిలక్‌ దంపతులు ఇద్దరు అనాథ బాలికలను దత్తత తీసుకుని తమ సొంత కూతుళ్లుగా పెంచుకున్న సంఘటన వారి ఔదార్యానికి అద్దం పడ్తుంది.

తిలక్ యొక్క బహుముఖ వ్యక్తిత్వానికి అనేక కోణాలు ఉన్నాయి. నిజమైన జాతీయవాది తిలక్ తన మాతృభూమిని మరియు స్థానిక సంస్కృతిని అమితంగా ఇష్టపడేవారు. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన తర్వాత సంపూర్ణ భారతీయ క్రైస్తవుడిగా జీవించడానికి ప్రయత్నించారు.

మహారాష్ట్రలో కొత్తగా మారిన మరాఠీ మాట్లాడే క్రైస్తవుల కోసం తిలక్ ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక-సాంస్కృతిక ఉద్యమాన్ని రూపొందించారు.ఈనాటికీ మహారాష్ట్రలోని చర్చిలలో హార్మోనియం, తాళాలు మరియు తబలా వంటి సంగీత వాయిద్యాలతోపాటు తిలక్ యొక్క భజనలు మరియు అభంగ్‌లు పాడబడటం, మరాఠీ క్రైస్తవ సమాజానికి తిలక్ అందించిన గొప్ప సహకారం.


తిలక్ రచనలు

తిలక్ మేథో సంపత్తి పెద్ద సంఖ్యలో  అతను రచించిన కవితలు మరియు ఇతర సాహిత్య రచనలలో ప్రతిబింబిస్తుంది. రెవ. భాస్కర్ ఉజాగారే 1914లో ‘తిలకంచి కవిత’ (తిలక్ కవిత్వం) అనే పేరుతో 84 కవితల సంకలనానికి సంపాదకత్వం వహించారు. లోకమాన్య తిలక్‌కి అత్యంత సన్నిహితుడైన నరసింహ చింతామణి కేల్కర్ ఈ కవితా సంకలనానికి ముందుమాట రాశారు.

తిలక్ యొక్క ఇతర ప్రసిద్ధ రచన క్రైస్తవ బైబిల్ ఆధారంగా పూర్తిగా భారతీయ సంప్రదాయం ప్రకారం ఒక ఇతిహాసం రూపొందించబడింది. ఇది ఇటాలియన్ జెస్యూట్ జోసెఫ్ బెస్చి అలియాస్ విర్మమునివర్ రాసిన తమిళ ఇతిహాసం ‘టెంబవాణి’తో మరియు 17వ శతాబ్దపు మరాఠీ ఇతిహాసం ఫాదర్  థామస్ స్టీఫెన్స్ రాసిన ‘క్రిస్ట్‌పురాన్’తో సారూప్యతను కలిగి ఉంది. ఫాదర్ బెస్చి మరియు ఫాదర్ స్టీఫెన్స్ ఇద్దరూ విదేశీయులు, వారు ప్రాంతీయ భాషలలో క్రైస్తవ ఇతివృత్తాల ఆధారంగా ఇతిహాసాలు రచించారు. తిలక్ ఇదే పద్ధతిలో ఒక ఇతిహాసం రచించిన మొదటి భారతీయ క్రైస్తవ మిషనరీ.

‘క్రిష్టయానా’(Christayana )

భారతీయ క్రైస్తవ ఆరాధనలు స్థానిక సంస్కృతి మరియు సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోవాలని తిలక్ కోరుకున్నారు - ఐదు దశాబ్దాల తర్వాత రెండవ వాటికన్ కౌన్సిల్ ఈ సూత్రాన్ని నొక్కిచెప్పింది. ఆ ప్రయత్నంలో భాగమే ‘క్రిష్టయానా’ అనే ఇతిహాసం. తిలక్ 1910లో ‘క్రిష్టయానా’ రాయడం ప్రారంభించాడు. చాలా సార్లు, అతను తన ఇంటిని విడిచిపెట్టి, సతారా జిల్లాలోని పంచగని మరియు భుజ్ వంటి ప్రదేశాలలో నివసిస్తూ ఈ మిషన్‌కు పూర్తిగా అంకితమయ్యాడు. తన జీవిత చరమాంకంలో అతను అదే ప్రయోజనం కోసం తన కుటుంబంతో సతారా పట్టణంలో స్థిరపడ్డాడు. కానీ ఇతిహాసం పూర్తి చేయాలనే అతని కోరిక నెరవేరలేదు. అతను చనిపోయే ముందు 10 అధ్యాయాలు మరియు 11వ అధ్యాయంలో కొంత భాగాన్ని మాత్రమే పూర్తి చేయగలిగాడు.

అతను మరణించిన పన్నెండేళ్ల తర్వాత - 1931లో - లక్ష్మీబాయి తన భర్త యొక్క అసంపూర్ణ పనిని పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. తరువాతి ఐదేళ్లలో, ఆమె 64 అధ్యాయాలను జోడించింది. ఆమె మరణానంతరం, వారి కుమారుడు దేవదత్త ముగింపు 76వ అధ్యాయాన్ని రచించాడు. 1938లో ఎట్టకేలకు ‘క్రిష్టయానా’ అనే ఇతిహాసం ప్రచురించబడింది. దీనికి  ప్రముఖ కవి ఎస్ కె కనేత్కర్ సంపాదకత్వం వహించారు.

భజనలు పాడటం మరియు చర్చిలలో కీర్తనలు నిర్వహించడం వంటి భారతీయ ఆరాధనా విధానాలను పరిచయం చేయడంలో అతని  కాలంలో తిలక్ ఒక అరుదైన విజయం సాధించాడు. అతను అభంగాల సంకలనంపై తన పుస్తకానికి ముందుమాటలో ఇలా రాశాడు; "భజనలు పాడటం మరియు పురాణాల నుండి కథలు చెప్పడం అనేది మతాన్ని ప్రచారం చేసే సాంప్రదాయిక మార్గాలు. ఇవి ప్రజలచే ప్రశంసించబడతాయి మరియు సమర్థించబడతాయి." అతని ప్రయత్నాలు మహారాష్ట్రలో గొప్ప ఫలితాలను  అందించాయి. ఇప్పటికీ కాథలిక్ మరియు ప్రొటెస్టంట్ చర్చిలలోని విశ్వాసులు దీనిని అనుసరిస్తూనే ఉన్నారు

క్రైస్తవ మతంలోకి మారడం అంటే వేరే దేశానికి వలస వెళ్లడం కాదని, మతం మారిన తర్వాత కూడా ప్రజలు తమ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును నిలుపుకోవాలని తిలక్ అభిప్రాయపడ్డారు. అతను నిజంగా భారతీయ సంస్కృతిలో గర్వించదగిన జాతీయవాద మిషనరీ. తన జీవితంలోని తరువాతి సంవత్సరాల్లో పరిత్యాగానికి ప్రతీకగా ఊదా రంగు దుస్తులను మాత్రమే ధరించాడు .

అతను మతం మారడానికి ముందు, ఒక స్నేహితుడు తిలక్‌ని ఇలా అడిగాడు: “మీరు క్రైస్తవులైన తర్వాత మీ తీవ్రమైన దేశభక్తి అలాగే ఉంటుందా?” ఈ ప్రశ్నకు సమాధానంగా, తిలక్ ఒక పద్యం రచించారు, ఇది తిలక్ యొక్క దేశభక్తిని తెలియజేస్తుంది. మరాఠీ నుండి విస్తృతంగా అనువదించబడిన తిలక్ పద్యం చివరలో తన లోతైన భావాలను వ్యక్తపరిచాడు: “ఓ ప్రియ మిత్రమా! భూమిపై జీవించేటప్పుడు నేను ఏడవవచ్చు, కుంగిపోవచ్చు, కష్టపడి పనిచేయవచ్చు, కానీ నేను క్రైస్తవునిగా మారినప్పటికీ నా స్వంత దేశం కోసం చనిపోతాను. ఇలా చేయడం ద్వారా, నేను క్రీస్తు కృపను పొందుకుంటాను. లేకపోతే, నేను పేరు కోసం మాత్రమే క్రైస్తవుడిని.” తిలక్ ఈవిధంగా నమ్మాడు, “ఒక క్రైస్తవుడు క్రీస్తులా ఉండాలి. మరియు ఒక భారతీయ క్రైస్తవుడు ప్రాచ్య క్రీస్తు వలె ఉండాలి.

మరాఠీ క్రైస్తవ సాహిత్యం

19వ శతాబ్దం చివరలో మరియు 20వ శతాబ్దం ప్రారంభంలో, పశ్చిమ మహారాష్ట్ర, మరాఠ్వాడా మరియు ఉత్తర మహారాష్ట్ర నుండి వందలాది కుటుంబాలు క్రైస్తవ మతాన్ని స్వీకరించాయి. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన తర్వాత కూడా ఉన్నత కులాల ప్రజలు వారిని అంటరానివారిగా పరిగణించడం కొనసాగించారు.

తిలక్ స్వరపరిచిన అభంగాలు లేదా మరాఠీ శ్లోకాలు తమ కొత్త మతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న నూతన క్రైస్తవుల ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చాయి.  తిలక్ వంటి సంస్కృత పండితుడు చేసిన ఆధ్యాత్మిక కూర్పు కూడా గొప్ప సాహిత్య విలువను కలిగి ఉంది. అందుకే,  తిలక్ ప్రొటెస్టంట్ అయినప్పటికీ, అతని కీర్తనలు గత కొన్ని దశాబ్దాలుగా క్యాథలిక్ చర్చిలలో కూడా పాడబడుతున్నాయి.

తిలక్ 1912 నుండి 1919లో మరణించే వరకు ‘జ్ఞానోదయ’ అనే మరాఠీ పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. 1842లో అమెరికన్ మరాఠీ మిషన్ స్థాపించిన ఈ పత్రిక నేటికీ ప్రచురింపబడుతూనే ఉంది.

పండిత రమాబాయితో కలిసి పరిచర్య

తిలక్‌ను ఒకసారి పండిత రమాబాయి తన గ్రామమైన పూణే సమీపంలోని కేద్‌గావ్‌లో ఉండమని మరియు బైబిల్‌ను మరాఠీలోకి అనువదించడంలో సహాయం చేయమని ఆహ్వానించింది. దాదాపు 1905లో, తిలక్ లక్ష్మీబాయి మరియు కుమారుడు దేవదత్తాతో కలిసి దాదాపు ఆరు నెలలు కేద్‌గావ్‌లో ఉన్నారు. ఆ సమయంలో   రమాబాయి తన 108 భజనల సంకలనాన్ని 'భజన సంగ్రహ' పేరుతో తన ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రచురించారు. ఆమె తర్వాత దాని రెండవ ప్రచురణను కూడా ముద్రించింది.

కేద్‌గావ్‌లోని పండిత రమాబాయి 'ముక్తి సదన్'లోని బాలికలకు భారతీయ శాస్త్రీయ సంగీత శైలిలో పాడే క్రైస్తవ కీర్తనలు నేర్పించాలని తిలక్ పట్టుబట్టారు. అతను అదే ప్రయోజనం కోసం 'భజన సంగ్రహ' నిర్మించాడు. తిలక్ సందర్శనకు ముందు పండిత రమాబాయి పాశ్చాత్య సంగీత శైలిలో కీర్తనలు పాడటం అక్కడి బాలికలకు నేర్పేది.

పండిత రమాబాయికి సంస్కృతంలో పూర్తి పరిజ్ఞానం ఉండేది. తిలక్ సంస్కృతం నేర్చుకున్నాడు కానీ భక్తి సమూహానికి చెందిన మరాఠీ సాధువుల  సాహిత్యం ద్వారా అతను మరింత ప్రభావితమయ్యాడు. అందుకే సంత్ తుకారాం కట్టించిన వంతెనపై నడిచి క్రీస్తు పాదాల చెంతకు చేరుకున్నానని చెబుతుండేవాడు. తిలక్ మరియు పండిత రమాబాయి యొక్క భిన్నమైన దృక్పథంతో బైబిల్ అనువాదం  చేయడం కష్టతరమయ్యింది. అందువల్ల, ఆరు నెలల్లోనే,  తిలక్ తన కుటుంబంతో సహా కేద్‌గావ్‌ నుండి బయలుదేరాడు. తిలక్ కేద్‌గావ్‌ను విడిచిపెట్టినప్పటికీ పండిత రమాబాయితో అతని స్నేహం కొనసాగింది. తిలక్ తీవ్ర అనారోగ్యంతో ఉన్న అతని చివరి రోజుల్లో, పండిత రమాబాయి తన కుమార్తె మనోరమ ద్వారా అతనికి 100 రూపాయలు పంపింది.

తిలక్ యొక్క సంకల్పం అతని అపారమైన దేశభక్తి మరియు భారతీయ సంస్కృతి పట్ల ప్రేమకు నిదర్శనం. తన భౌతికకాయాన్ని పాశ్చాత్య సంప్రదాయం ప్రకారం ఖననం చేయకూడదని, భారతీయ సంప్రదాయం ప్రకారం జరిపించాలని, తన అంత్యక్రియల ఊరేగింపులో నలుపు రంగును నిషేధించాలని పట్టుబట్టారు. అతను ఇలా పలికాడు, “నా దగ్గరివారు మరియు ప్రియమైనవారు నా చితాభస్మాన్ని ఉంచే ప్రదేశంలో ఒక స్మారక చిహ్నాన్ని లేదా సమాధిని నిర్మించాలనుకుంటే, దానిపై ఈ క్రింది పంక్తులు చెక్కాలి: 'పుష్కల్ అజునీ ఉనా, ప్రభు మి, పుష్కల్ అజునీ ఉనా రే! ' (ఓ దేవా! నేను ఇంకా అసంపూర్ణంగా ఉన్నాను. దేవుడా! నేను ఇంకా అసంపూర్ణంగా ఉన్నాను!) నా పేరుకు 'రెవరెండ్' లేదా 'మిస్టర్' వంటివి జత చేయకూడదు. పేరును ఆంగ్లంలో N. V. తిలక్ అని కాకుండా నారాయణ్ వామన్ తిలక్ అని రాయాలి. నేను నా దేశాన్ని ప్రేమించినంతగా నా తల్లిదండ్రులను, భార్యను, పిల్లలను, స్నేహితులను లేదా నన్ను కూడా ప్రేమించలేదు.”

ముగింపు

తిలక్ ముంబైలోని J. J. హాస్పిటల్‌లో 9 మే, 1919న మరణించారు మరియు అతని అంత్యక్రియలను వర్లీ శ్మశాన వాటికలో నిర్వహించారు. అతని చితాభస్మాన్ని అహ్మద్‌నగర్‌కు తీసుకువెళ్ళి ఖననం చేసారు. తిలక్‌కి ఇష్టమైన మరాఠీ పద్యమైన ‘పుష్కల్ అజుని ఉనా’ మరియు కవి మాధవ్ జూలియన్ రాసిన కవితా నివాళి అతని స్మారక చిహ్నం వద్ద ఉన్న పాలరాతి ఫలకంపై చెక్కబడి ఉన్నాయి.


మహారాష్ట్ర ప్రభుత్వం 2019 లో  ఆయన శత వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిపాటు కార్యక్రమాలు నిర్వహించారు.  కానీ ఆయన తన సున్నిత భావాలతో అందించిన  తన కవితల ద్వారా జీవించే  ఉన్నారు. పువ్వులు, పక్షులు మరియు ప్రకృతిపై అతని కవితలు అతనికి గౌరవప్రదమైన, 'ఫూలా-ములంచె కవి' (పువ్వులు మరియు పిల్లల కవి)అనే పేరును సంపాదించిపెట్టాయి. మహారాష్ట్రలోని మరాఠీ మీడియం పాఠశాలల విద్యార్థులు  తిలక్ వ్యక్తిత్వం గురించి ఆయన సతీమణి లక్ష్మీబాయి తిలక్ 'స్మృతిచిత్రే' (జ్ఞాపకాలు) పేరుతో రచించబడిన ఆత్మకథ నుండి సంగ్రహించబడిన కొన్ని పాఠాల ద్వారా తెలుసుకుంటున్నారు.

నేటికీ, నారాయణ్ వామన్ తిలక్ మహారాష్ట్రలోని అత్యంత గొప్ప క్రైస్తవ రచయితలలో ఒకరిగా కీర్తించబడుచున్నారు. తిలక్ మరియు అతని భార్య లక్ష్మీబాయి వ్యక్తిత్వాలు అక్కడి  ప్రజలను ఇంకనూ ఆకర్షిస్తూనే ఉన్నాయి. వారి జీవితాలు మరియు రచనల ఆధారంగా అనేక పుస్తకాలు వ్రాయబడ్డాయి. వారి జ్ఞాపకాలు క్రైస్తవ మరాఠీ సమాజంలో ఎన్నటెన్నటికీ సజీవంగానిలిచే ఉంటాయి.





Monday 12 August 2024

Genesis Chapter 28 Quiz

1. Why did Isaac send Jacob to Paddan Aram ?

a) To find a wife

b) To escape Esau

c) To visit relatives

2. To whom did Isaac instruct Jacob to go in Paddan Aram?

a) Laban, his mother's brother

b) Esau, his brother

c) Ishmael, his uncle

3. What did Esau do when he saw that Isaac had blessed Jacob and sent him away ?

a) He followed Jacob

b) He married a daughter of Ishmael

c) He took revenge on Jacob

4. Where did Jacob stop for the night on his journey to Paddan Aram ?

a) Bethel

b) Beersheba

c) Haran

5. What did Jacob use as a pillow while sleeping at Bethel ?

a) A stone

b) His cloak

c) A bundle of hay

6. What did Jacob see in his dream at Bethel ?

a) A ladder reaching to heaven with angels ascending and descending

b) A burning bush

c) A great flood

7. Who stood above the ladder in Jacob's dream ?

a) An angel

b) The Lord

c) Moses

8. What promise did God make to Jacob ?

a) That Jacob's descendants would inherit the land

b) That Jacob would become king

c) That Jacob would live a long life

9. What did Jacob name the place where he had the dream ?

a) Luz

b) Bethel

c) Shiloh

10. What vow did Jacob make to God after his dream ?

a) To give a tenth of all he receives back to God

b) To return home immediately

c) To never leave Bethel

Saturday 3 August 2024

Genesis Chapter 27 Quiz


  1. Esau
    Jacob
    Ishmael
    Abraham

  2. Bring him a gift
    Cook a savory dish
    Wear Esau's clothes
    Pretend to be Esau

  3. His father's anger
    Being caught and punished
    Losing his birthright
    His brother's retaliation

  4. Animal skins
    Perfume
    Fine garments
    Jewelry

  5. He laughed
    He cried
    He trembeled
    He accepted it

  6. Forgive him
    Bless him
    Kill him
    Ignore him

  7. Egypt
    Canaan
    Haran
    Moab

  8. That Esau would forgive Jacob
    That Jacob would return soon
    That Jacob would find a wife in Haran
    That Esau would receive a greater blessing

  9. He wept bitterly
    He rejoiced
    He cursed Jacob
    He accepted it

  10. Kill Jacob
    Beg for forgiveness
    Leave his father's house
    Search for another blessing

Saturday 20 July 2024

Genesis Chapter 26 Quiz


  1. Egypt
    Canaan
    Gerar
    Mesopotamia

  2. Land and wealth
    Numerous descendants
    Protection from enemies
    A long life

  3. He feared for his life
    He wanted to test Abimelech's integrity
    He wanted to keep his marriage a secret
    He was ashamed of Rebekah

  4. They praised God
    They made peace with Isaac
    They envied him
    They drove him away

  5. By building altars and calling on the name of the Lord
    By gathering an army
    By negotiating treaties
    By seeking alliances with other tribes

  6. Land ownership
    Water rights
    Livestock
    Marriage alliances

  7. Rehoboth
    Shebah
    Beersheba
    Enosh

  8. A treaty of peace
    Isaac's blessing
    Isaac's allegiance
    Protection for his people

  9. It symbolized reconciliation and peace
    It was a sign of victory
    It marked the transfer of land
    It represented the sealing of a business deal

  10. He married outside the family
    He stole Jacob's birthright
    He left the land of Canaan
    He married Hittite women

Monday 8 July 2024

Genesis Chapter 25 Quiz

 


  1. Hagar
    Keturah
    Leah
    Rachel

  2. One
    Two
    Three
    Four

  3. Ishmael
    Isaac
    Esau
    Jacob

  4. Money
    A bowl of stew
    Land
    Clothing

  5. Jacob
    Israel
    Edom
    Ishmael

  6. 20
    30
    40
    50

  7. Egypt
    Canaan
    Gerar
    Beersheba

  8. She was his sister
    She was his servant
    She was his wife
    She was his cousin

  9. They made peace with him
    They envied him
    They attacked him
    They ignored him

  10. He filled them with dirt
    He expanded them
    He destroyed them
    He reopened them

Monday 1 July 2024

వి.యస్.అజరయ్య - భారతదేశంలో ఆంగ్లికన్ చర్చ్ తొలి బిషప్



                                     

మొదటి శతాబ్దములోనే యేసు క్రీస్తు శిష్యులలో ఒకరైన తోమా భారతదేశంలో  సువార్తను ప్రకటించారు. ఆ తరువాత అనేక దేశాలకు సంబంధించిన సంఘాల వారు మిషనరీలను పంపించారు. 17 వ శతాబ్దంలో బ్రిటిష్ దేశానికి చెందిన ఆంగ్లికన్ చర్చ్  మిషనరీలు మన దేశానికి వచ్చారు.

సెయింట్ పాల్స్ కెథడ్రిల్, కలకత్తా నగరం. డిసెంబర్ 12,1912 వ సంవత్సరం. అక్కడ అంతా ఉత్సవ వాతావరణం నిండి ఉంది. భారతదేశం అంతా కలిసి ఆ కెథడ్రిల్ కే వచ్చిందా అన్నట్లుగా అన్ని రాష్ట్రాల ప్రజలు అక్కడ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దానికి కారణం దైవజనుడైన ఒక వ్యక్తి. ఆయన క్రైస్తవ ఐక్యతకు  ప్రతీక, సువార్త పరిచర్యకు అపోస్తలుడు. అరణ్యంలా ఉన్న భారతదేశ క్రైస్తవ సంఘానికి మొట్ట మొదటి బిషప్ గా ఆంగ్లికన్ సంఘముచే అభిషేకం చేయబడిన బిషప్ వేద నాయగం శామ్యూల్ అజరయ్య. 

బాల్యం, విద్యాభ్యాసం :

అజరయ్య కన్యాకుమారికి దగ్గరగా ఉన్న వెల్లనవిలాయ్ అను గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి పంటగింజలను అమ్మేవాడు. ఆయన తన చిన్నతనంలో క్రైస్తవ మతాన్ని స్వీకరించి సత్యాన్వేషణలో సిఎంఎస్ (చర్చ్ మిషనరీ సొసైటీ)  నకు సంబంధించిన మిషనరీల వద్దకు వెళ్ళాడు. 1839 లో బాప్తీస్మం తీసుకొని థామస్ వేదనాయగం అనే పేరుతో పిలువబడ్డాడు,1869 లో డీకన్ గా చర్చిలో ఉంటూ సంఘ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవాడు. ఆయనకు 13 ఏళ్ల నిరీక్షణ తరువాత ఆగష్టు 17, 1874 లో మగపిల్లవాడు జన్మించాడు. అతనికి శామ్యూల్ అజరయ్య అని నామకరణం చేశారు. అతడు చిన్నప్పటి నుండి చదువులలో , బైబిల్ జ్ఞానం లో ఎంతో ఆసక్తిని కలిగి ఉండేవాడు. అతడు ప్రార్థనాపరులైన తన తల్లిదండ్రులను, గురువులను ఎంతగానో అభిమానించేవాడు.

1885, జనవరి 1 న ఆయన తిరునల్వేలి లోని మైజ్ఞానపురం అనే ప్రదేశంలో సిఎంఎస్ బోర్డింగ్ స్కూల్ నందు చేరారు. ఆ తరువాత కాలేజీ విద్యను మధ్యలో విడచి  పాలాయనకోటం లోని సిఎంఎస్ హైస్కూల్ లో టీచరుగా కొంతకాలం పని చేశారు.  ఉన్నత విద్యకై మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో చేరారు. అక్కడి ప్రిన్సిపాల్ డాక్టర్ విలియం ముల్లర్ అజరయ్య ను ఎంతో ప్రభావితం చేశారు. కాని ఇంఫ్లుఎంజా రావడం వలన బిఎ ఆఖరి సంవత్సరం పరీక్షలను రాయలేకపోయారు. ఆర్ధిక ఇబ్బందుల వలన ఆయన యూనివర్సిటీ విద్యను కొనసాగించలేకపోయారు.

ఉద్యోగం, వివాహం  :

 అజరయ్య 14 సంవత్సరాలు వైఎంసిఎ నందు పనిచేశారు. అక్కడ ఆయనకు జాన్.ఆర్.మోట్, జార్జ్ షేర్ఉడ్ ఎడ్డీ , రాబర్ట్ విల్డర్ మరియు జి .ఉల్డ్ హామ్ అను వారు మిషన్స్ పట్ల ఆసక్తిని కలిగించారు. వారు స్టూడెంట్ వాలంటీర్ మూమెంట్ ను ప్రారంభించారు. ఈ తరము లోని ప్రపంచాన్ని సౌవార్తీకరించడమే దాని ప్రధాన లక్ష్యం. జూన్ 29, 1898 న అజరయ్య  అంబు మణియమ్మాల్ ను పరిశుద్ధ వివాహం చేసుకున్నారు. ఆమె కూడా తిరునల్వేలికి చెందిన మిషనరీ మనస్సు కలిగి దైవజ్ఞానంతో నిండిన స్త్రీ. ఆమె తన భర్తను ప్రోత్సహిస్తూ సాటియైన సహకారిగా ఉండేది. వారికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలను సంతానంగా దేవుడు అనుగ్రహించాడు.

ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలలో పరిచర్య :

1836 వ సంవత్సరంలో మద్రాసుకు చెందిన బిషప్ కోరి ఆంధ్రప్రదేశ్ ను దర్శించారు. అక్కడ  కేవలము నలుగురు భారతీయ క్రైస్తవులు మాత్రమే నిర్థారణకు సిద్ధంగా ఉన్నారు. 1837 లో కృష్ణా జిల్లా కలెక్టరుగా పనిచేసిన దైవభక్తి గల గోల్డింగ్ హామ్  ఈ విధంగా తెలియచేసారు. “ ఆంగ్లికన్ చర్చికి చెందిన ఏ ఒక్క సువార్తికుడు తెలుగు ప్రజలకు సువార్తను ప్రకటించుటకు గాని , కనీసం కరపత్రికలను వారి భాషలో ఇచ్చుటకు గాని ఇంతవరకు  ఎవరూ రాలేదు”. అనేక క్రైస్తవ మిషనరీ సంస్థలు దీని విషయమై ప్రార్ధించాయి. 1835 లో నెల్లూరు నందు అమెరికా బాప్టిస్ట్ మిషన్ వారిచే పరిచర్య ప్రారంభమయ్యింది. ఆ తరువాతి దినాలలో బందిపోటు దొంగగా ఉన్న వెంకయ్య అనే వ్యక్తి మార్పు వలన క్రైస్తవ ఉద్యమం బలపడింది. 1901 వ సంవత్సరానికంతా కృష్ణా జిల్లాలో 29,186 మంది క్రైస్తవులుగా మారారు. ఆ తరువాత జార్జ్ షేర్ఉడ్ మరియు ఎడ్డీ అనే మిషనరీలు భారతదేశమంతా తిరిగి సువార్త అందని అనేక ప్రదేశాలు ఇంకా ఉన్నాయని గుర్తించారు. వైయంసిఎ నందు వారి సహోద్యోగి అయిన అజరయ్యతో ఈ విషయాన్ని పంచుకున్నారు. భారతదేశాన్ని అంతా సువార్తతో సంధించాలనే ఆకాంక్ష యువకుడైన అజరయ్య లో కలిగింది. 1903 లో తిరునల్వేలి ఇండియన్ మిషనరీ సొసైటీని  కొందరు తమిళ క్రైస్తవ పరిచారకులతో కలిసి ప్రారంభించారు. అపోస్తలుడైన పౌలు వలె ఆయన సువార్త అనేక ప్రాంతాలలో , వేరొకరు పునాది వేయని స్థలాలలో మాత్రమే సువార్తను ప్రకటించాలని నిశ్చయించుకున్నారు. అప్పటికి సువార్త అందని ప్రాంతముగా ఉన్న డోర్నకల్ ను వారు చేరుకున్నారు. ఆ దినాలలో అది హైదరాబాద్ నిజాంల పాలనలో వున్నది. 1905 లో అజరయ్య మరియు అతని స్నేహితుడు కె.టి.పాల్ కలిసి నేషనల్ మిషనరీ సొసైటీని ప్రారంభించారు. భారతదేశము మరియు పొరుగు దేశాలలోని సువార్త అందని ప్రదేశాలకు వెళ్లి ప్రకటించుట దీని లక్ష్యం. ఇండియా ప్రజలు, ఇండియా డబ్బు మరియు ఇండియన్ల యొక్క మార్గదర్శకం లో ఇది పనిచేస్తుంది. 1906 లో వారికి వాలంటరీగా వచ్చిన ధనము 2,000 రూపాయలు. అజరయ్య ఆయా ప్రదేశాలలో ప్రజలకు సువార్త అందించడమే కాకుండా  అక్కడి ప్రజల  అవసరాలను గుర్తెరిగి పనిచేయాలని సంకల్పించారు.  అనేకమందిని మిషనరీలుగా వెళ్ళడానికి ఉత్తేజ పరిచిన పిమ్మట , నేనే ఆ ప్రదేశానికి వెళ్ళకూడదు? అన్న ప్రశ్న ఆయన మనస్సులో దేవుని స్వరము అడుగుటచే దానికి లోబడి డోర్నకల్ కు వచ్చుటకు సిద్ధపడ్డారు.

మిషనరీ పరిచర్యలో అజరయ్య దంపతులు : 

శ్రీమతి అంబు అజరయ్య మిషనరీ పరిచర్య అంతటిలో ఎంతో సహకారం అందించింది. క్రొత్త ప్రదేశంలో ఇంటి వసతులు సరిగా లేకపోయినా, తగ్గింపు గల జీవితాన్ని ఎంతో ధైర్యంగా సంతోషంతో స్వీకరించింది. ఆమె తన తోటి పరిచారకులకు ఎన్నో విధాలుగా తోడ్పడేది. డోర్నకల్ లో పాఠశాల  మరియు బోర్డింగ్ స్కూల్ నెలకొల్పడంలో, స్త్రీలను పరిచర్యలో ప్రోత్సహించడంలో ఆమె కృషి మరువలేనిది. ఆమె తల్లులకు ప్రత్యేకంగా కరపత్రికలను ముద్రించి పంచిపెట్టేది. అజరయ్య కూడా అనేక రచనలను చేశారు. క్రైస్తవ దాతృత్వము పై  ఆయన రాసిన పుస్తకము 50  కి పైగా భాషల లోనికి అనువదించబడింది. బాప్త్తీస్మము , ప్రభురాత్రి భోజనము సంస్కారము, ప్రకటన  గ్రంథము యొక్క కామెంటరీ మొదలగు వాటిని  ఆయన రచించారు. 1922 లో డోర్నకల్ డయాసిస్ గా ఏర్పడింది. 

1915 లో డోర్నకల్ చర్చి కట్టడానికి పునాది వేయబడింది. 1938లో నిర్మాణం పూర్తయ్యింది. ఆ కెథడ్రిల్ డిజైనింగ్ అంతా అజరయ్య స్వయంగా చేశారు. ఇటుక వెంబడి ఇటుక పేర్చుకుంటూ అది దేవుని ఆరాధనకు ఒక మహిమకరమైన ప్రదేశంగా కట్టబడుటలో అజరయ్య పాత్ర మరువలేనిది.

జూన్ 1910 లో స్కాట్లాండ్ లోని ఎడిన్బర్గ్ లో ప్రపంచ మిషనరీ సదస్సు జరిగింది. దానిలో  అనేక మంది ప్రముఖ మిషనరీలు పాల్గొన్నారు. అందులో తన స్వరం వినిపించే అవకాశం వచ్చింది అజరయ్యకు. విదేశీ మిషనరీలు మరియు వారి సహ  ఉద్యోగుల మధ్య ఉన్న బలహీన సంబంధాలు, సాంఘిక అసమానతలను ఆయన తనదైన శైలిలో దృఢమైన స్వరంతో వినిపించారు. ఈ ప్రసంగము ద్వారా భారతదేశ మిషనరీ ఉద్యమంలో అనేక మార్పులు రావడానికి నాంది పలికింది. ఆయనకున్న రెండు లక్ష్యాలు డోర్నకల్ కెథడ్రిల్ నిర్మాణం మరియు పిల్లల కొరకు వసతి గృహం. ఈ రెండు కూడా చక్కని నిర్మాణ శైలిలో హైదరాబాద్ నిజాం యొక్క అనుమతితో ఆయన నెరవేర్చారు.

అజరయ్య విశిష్టతలు మరియు రచనలు:

అజరయ్య ఆద్వర్యంలో ఒక బలమైన సంఘం డోర్నకల్ లో స్థాపించబడింది. దానిని ఆత్మీయంగా బలపరచుటలో ఆయన ఎనలేని కృషి చేశారు. సౌవార్తిక ప్రయత్నాలను కొనసాగించారు. నూతన ప్రదేశాలలో సువార్తను ప్రకటించారు. బాప్తీస్మము ఇవ్వడంలో కూడా ఆయన ఎంతో జాగ్రత్తగా సభ్యులకు హెచ్చరికలు ఇచ్చేవారు. ఆయన సంఘానికి ‘ ప్రతీ క్రైస్తవుడు ఒక సాక్షే’ అనే నినాదాన్ని ఇచ్చి ‘ సాక్ష్యపు వారాన్ని’ పాటించాడు. అది నూతన వ్యక్తులకు సువార్త ప్రకటించడానికి ఒక చక్కని సృజనాత్మకమైన ఆలోచన. అపోస్తలుడైన పౌలు వలె సంఘంలో బలమైన పునాదులను వేయుటకు బిషప్ అజరయ్య పాటుబడ్డారు. 

‘ ఈ తరం లో బైబిల్ ను అధ్యాయం చేసే సంఘం ‘ మరియు ‘ ప్రతి ఒక్కరూ ఒకనికి బోధించండి’ వంటి నూతన పద్ధతులను ప్రవేసపెట్టి బైబిల్ అధ్యయనాన్ని ప్రోత్సహించారు. ఆయన పాస్టర్లకు వేదాంత విద్యలో తర్ఫీదు చేయుటకు ప్రాముఖ్యత నిచ్చేవారు. పాస్టర్ల అవసరాలు తీర్చే భాద్యత సంఘానిదే అని ఆయన భావించేవారు. గ్రామీణ జీవన విధానాన్ని అర్థం చేసికొని వారికి బోధించాలని ఆయన పాస్టర్లకు తెలియజేసేవారు. వారి సమస్యలను అర్థం చేసికొని సహాయం చేసేవారు.

బిషప్ అజరయ్య బైబిల్ ను ఎంతో ప్రేమించేవారు. ‘ నా చిన్నతనంలో నా తల్లి ద్వారా నేను బైబిల్ జ్ఞానం సంపాదించుకున్నాను. బైబిల్ పట్ల ప్రేమను అది నాలో పెంపొందించింది’ అని ఆయన చెప్పేవారు. సంఘ నాయకులకు సంవత్సరాంతంలో జరిగే రిఫ్రెషర్ కోర్సులలో ఆయన బైబిల్ ఎక్స్ పోజిషన్స్  ఇచ్చేవారు. అది ఎంతో సమగ్రమైన అధ్యయనంతో , వాస్తవ విషయాలతో అత్మీయాభివృద్ధి కి తోడ్పడేది.

ఆయన చేసిన మిషనరీ పరిచర్యకు ప్రభావితురాలైన ఆయన కుమార్తె మెర్సీ మిషనరీగా సమర్పించుకొని మధ్య భారతదేశంలోని గోండుల మధ్య పరిచర్య చేయుటకు తీర్మానం చేసుకుంది. అక్కడ ఆ పరిచర్య కొనసాగుటలో బిషప్ అజరయ్య ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు.   భారతదేశాన్ని క్రీస్తు కోసం గెలవాలన్న దీక్ష , బలమైన ఆకాంక్ష , పట్టుదల కలిగి ఉండేవాడు. ఆయనను ‘క్రైస్తవ ఐక్యతకు అపోస్తలుడు’ అని క్రైస్తవ నాయకులు సంభోదించేవారు. ఆయన సంఘాలలో ఐక్యతకు ఎంతో కృషి చేశారు.

ఆయన మంచి బోధకుడు. నమ్మకమైన బైబిల్ అధ్యాపకుడు. ఆయన అన్ని విషయాలు విని తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు. తన తీరిక లేని జీవితంలో కూడా ఒక పుస్తకం లేదా వ్యాసాన్ని రాయడం, అనువదించడం, ఉత్తరాలు రాయడం, ప్రత్యేక సందేశాలను తయారు చేయడం - ఇవి అన్నీ తన స్వంత చేవ్రాత తోనే చేసేవారు. ఆయన దస్తూరీ ఎంతో అందంగా ఉండేది. 180 కి పైగా పుస్తకాలు, వ్యాసాలు, అనువాదాలు చేశారు. పాస్టర్లకు మరియు బోధనకు సహాయపడే రచనలు చేశారు. హోలీ బాప్టిసం, ది పాస్టర్ అండ్ ద పాస్టరేట్ , లెసన్స్ ఆన్ మిరకల్స్, క్రిస్టియన్ గివింగ్ , కన్ఫర్మేషన్, సబ్బాత్ ఆర్ సన్ డే మొదలగు పుస్తకాలను రాశారు ఛార్లెస్.జి.ఫిన్నీ మరియు ఆండ్రూ ముర్రే ల యొక్క రచనలను అనువదించారు.

ఆయన ఎప్పుడూ బీదలను ఉద్దరించాలని ఆశించేవారు. సామాజిక సంస్కరణలను సువార్త ద్వారానే సాధించగలమని , రక్షించుటకు దేవుని శక్తి ద్వారానే సాధ్యమని ఆయన విశ్వసించేవారు. యేసు క్రీస్తు సంఘాన్ని ప్రేమించి తనను తాను అర్పించుకొనిన విధంగా ఆయన సంఘాన్ని ప్రేమించి తన సర్వస్వం సంఘసేవలోనే సమర్పించారు. ఆయన తనకంటూ ఏమీ మిగిల్చుకోలేదు. 

ముగింపు : 

ఆయన తన చివరి దినాలను గ్రామాలలో గడిపారు. అప్పటి పయనీరింగ్ ప్రాంతంగా ఉన్న పరకాల లో క్రిస్మస్ ప్రోగ్రాం కు హాజరయ్యారు. బస్సులో 70 మైళ్ళు ప్రయాణం చేసి ఆ తరువాత ఎడ్లబండిలో ప్రయాణించి అక్కడకు చేరుకున్నారు. ప్రజలకు నిర్థారణ ఇచ్చారు. అక్కడి గ్రామప్రజలు క్రీస్తు రెండవ రాకడను గూర్చి పాడిన పాటలు విని ఆనందించారు. స్వల్ప ఆనారోగ్యంతో ఆయన డోర్నకల్ లోని తన గృహానికి తిరిగి వచ్చారు. అది తీవ్ర జ్వరంగా మారి అనారోగ్యానికి గురై 1945 జనవరి 1 న ప్రభువు సన్నిధికి వెళ్ళారు. 32 సంవత్సరాలు బిషప్ గా సుదీర్ఘమైన పరిచర్య చేసి తన తరంలో దేవుని కొరకు బలంగా వాడబడి ప్రభువు పనిని నమ్మకంగా చేసిన భారతదేశపు తొలి బిషప్ గా , సమర్థుడైన సంఘ నాయకునిగా ఆయన ఖ్యాతి చిరకాలం క్రైస్తవ సంఘ చరిత్రలో నిలచివుంటుంది. 






Quotes from Famous Scientists about God

  • Albert Einstein -Science without religion is lame, religion without science is blind.
  • Isaac Newton-I have never denied the existence of God. I think the universe is too complex and harmonious to be a result of chance.
  • Galileo Galilei-God is known by nature in his works, and by doctrine in his revealed word.
  • Johannes Kepler-To the Lord whom I worship and thank, That governs the heavens with His eyelid, I return, exalted at His command.

Today's Verse

Systematic Theology in Telugu

Visit Elselah Book House


Total Pageviews